వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని పట్టుదల మీదున్న టీడీపీ అందుకోసం ఇంతకు ముందెన్నడూ చేయని రిస్క్ కి తెగిస్తోంది. నిజానికి బాబు ఆలోచనలకు భిన్నంగా ఈసారి ఎన్నికల విషయంలో ముందస్తు కసరత్తు జరుగుతోంది. పార్టీ ముఖ్యం, దాని ముందు ఎంతటివారైనా పక్కన పెట్టేయడమే అన్న తీరులో బాబు దూకుడు సాగుతోందంటున్నారు.


వారంతా వేస్టేనా :


బాబు ఏది చేయాలన్నా ఓ పధ్ధతి ఉంటుంది. దానికోసం ఆయన మీడియతో సహా సర్వ శక్తులనూ తనకు అనుకూలంగా వాడేసుకుంటారు. ఇలా అనుకూల మీడియా సర్వేలతో ఓటమి చెందుతారని వచ్చిన ఎమ్మెల్యేలను ఇంటికి పంపించేయడానికి బాబు డిసైడ్ అయ్యారట. ఇపుడు ఇది టీడీపీ అనుకూల మీడియాలో న్యూస్ గా వస్తోంది. అంటే  బాబు తొందరలోనే ఆ లిస్ట్  బయటకు తీస్తారన్న మాట.


టిక్కు పెట్టేది వీళ్ళకే :


పార్టీ పరంగా జనంలో పెద్దగా మైలేజ్ పెంచని వాళ్ళను, అవినీతిలో మునిగి తేలుతున్న వాళ్ళను, కార్యకర్తలను లెక్క చేని వాళ్ళను, తాను ఎన్ని సార్లు మందలించినా పని తీరు మార్చుకోని వాళ్ళను బాబు ఈ సర్వే పేరుతో బలి చేయబోతున్నరని టాక్. వాళ్ళకు టికెట్ ఇవ్వకూడదని బాబు గట్టిగా అనుకుంటున్నారని అనుకూల మీడియా ఒకటే ఊదరగొడుతోంది.


గుండెళ్ళో రైళ్ళు :


బాబు టిక్కు పెట్టేది ఎవరికో తెలియక ఎమ్మెల్యే తమ్ముళ్ళ గుండెళ్ళో రైళ్ళు పరిగెడుతున్నాయట.  ఒకేసారి ఇలా నలభై మందిని ఇంటికి పంపిస్తే  ఎలా అంటున్నారు. టీడీపీ సర్కార్ మొత్తం పైన అవినీతి ఆరోపణలు వస్తే కేవలం ఎమ్మెల్యేను బలి చేస్తే సరిపోతుందా అని ఫైర్ అవుతున్నారు. మంత్రుల స్థాయిలోనే అవినీతి ఎక్కువని నాలుగేళ్ళుగా మీడియా కోడై కూస్తోందని, వారిని కూడా పక్కన పెడతారా అని అడుగుతున్నారు. మరి చూడాలి, బాబు టిక్కు పెట్టేదెవరికో, ఆ లెక్కెలా ఉంటుందో.. 


మరింత సమాచారం తెలుసుకోండి: