అన్నీ చుట్టేశారుగా :
గీత వైసీపీ నుంచి తొలిసారి పోటీ చేసి అరకు ఎంపీ పదవి చేపట్టారు. ఆ తరువాత వెంటనే అధికార తెలుగుదేశం వైపుగా వెళ్ళిపోయారు. కొన్నాళ్ళు అలా ఉన్న తరువాత చంద్రబాబుని కూడా విమర్శించడం మొదలు పెట్టారు. ఈ మధ్యలో జనసేనలో చేరుతారని ప్రచారం సాగింది. ఇక పార్లమెంట్లో అవిశ్వాసం సందర్భంగా ప్రధాని మోడీని వెనకేసుకురావడంతో ఆమె బీజేపీలో చేరుతారని భావించారు. మరి ఏం జరిగిందో ఏమో ఇపుడు కొత్త పార్టీ అంటునారు.
దాని విధి విధానాలు అవి చూసాక కానీ ఆమె రూట్ ఏంటన్నది చెప్పాల్సి ఉంది.ఏది ఏమైనా కేంద్ర మంత్రిగా ఉన్న సీనియర్ కాంగ్రెస్ రాజకీయవేత్త కిశోర్ చంద్రదేవ్ వంటి దిగ్గజాన్ని ఓడించి సంచలనం క్రియేట్ చేసిన గీత కొత్త పార్టీతో ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.