టీడీపీ లో సోమి రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జగన్ ను విమర్సించే వారిలో మొదటి స్థానం లో ఉంటాడు. అయితే ఇతను గారు నెల్లూరులో  ఏ పొద్దు గెలిచినా పాపాన పోలేదు. కానీ జగన్ ను విమర్శించే పని లో మాత్రం ముందుంటాడు. ఎప్పుడూ కూడా తాను మాట్లాడే మాటల్లో ఒక పాయింట్ ఉండాలని గానీ, ఒక తర్కబద్ధమైన వాదన ఉండాలని గానీ, దానికి తలాతోకా ఉండాలని గానీ ఆయన అనుకోరు.

Image result for somireddy

నోటికి ఏది వస్తే అది.. అనే  ప్రాతిపదికన ఎడాపెడా మాట్లాడేస్తూ ఉంటారు. అలాంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తాజాగా.. పార్టీలు పెట్టుకునే పొత్తులను పెళ్లిళ్లుగా అభివర్ణిస్తూ... జగన్ కు పెళ్లియావ ఎక్కువైందంటూ.. అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టడానికి తెలుగుదేశం పార్టీ వద్ద ఉన్న అస్త్రాలు అన్నీ అయిపోయాయి. జగన్ మీద హద్దూ అదుపు లేకుండా అవినీతి ఆరోపణలు గుప్పించారు గానీ... నిజానికి కోర్టులోనే ఆ అవినీతి కేసులు తేలిపోతున్న వేళ.. ప్రజలు వాటి గురించి అసలే పట్టించుకోవడం లేదని చంద్రబాబునాయుడుకు అర్థమైనట్లుంది.

Image result for jagan

ఇప్పుడిక జగన్ ను నీరుగార్చడానికి వారు ఎంచుకున్న ఏకైక మార్గం భాజపాతో జట్టుకడుతున్నాడని ప్రజల్ని నమ్మించడం. తాజాగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ... జగన్ కు పెళ్లి యావ ఎక్కువైందని అంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ లో ఉండగా, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్, సమాజ్ వాదీ పార్టీలను పెళ్లాడిన జగన్ కు వైకాపా అనేది ఆరోపెళ్లి అని అంటున్నారు. తెలుగుదేశానికి ఆరోపెళ్లి అని సాక్షి వ్యాఖ్యానించింది గనుక.. అదే విమర్శను తిప్పికొట్టడానికి సోమిరెడ్డి పాట్లు పడుతున్నట్లుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: