ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ విశాఖపట్టణం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. ఈ సందర్భంగా జగన్ వస్తున్న నేపథ్యంలో విశాఖ జిల్లాలో ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చి ముఖ్యంగా యువత బ్రహ్మరథం పడుతున్నారు జగన్ పాదయాత్రకి. జగన్ తన పాదయాత్రలో భాగంగా ఇటీవల విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో కోటవురట్ల లో జరిగిన బహిరంగసభలో తెలుగుదేశం పార్టీ నాయకులపై తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా గత ఎన్నికలలో చంద్రబాబు ఇచ్చిన హామీల ప్రస్తావన ఎత్తి ప్రజలకు అర్థమయ్యే రీతిలో జగన్ చేసిన కామెంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులకు దిమ్మతిరిగిపోయింది.

Related image

తాజాగా ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించిన జగన్ కి ఆ ప్రాంత ప్రజలు ఏరా జనాలు పట్టారు అదేవిధంగా విశాఖ జిల్లాలో కూడా ప్రజలు బాగా అక్కున చేర్చు కోవడం తో తెలుగుదేశం పార్టీ నాయకులకు మింగుడుపడటం లేదు అన్నట్లుగా ఉంది..ఈ క్రమంలో విశాఖ జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత జగన్ పాదయాత్ర పై దారుణమైన కామెంట్లు చేశారు. చంద్రబాబును ఇబ్బంది పెడుతూ జగన్ చేస్తున్న పాదయాత్ర కేవలం కాళ్లకు నొప్పులు వస్తాయి తప్ప ఓట్లు పడవు అని అన్నారు.

Related image

జగన్ చేసిన కామెంట్లపై దమ్ముంటే బహిరంగ చర్చకు సిద్ధపడాలని సవాల్ విసిరారు. విసిరారు. జగన్‌కు ఏపీ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తోందని ధ్వజమెత్తారు. అనవసర ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అయితే ఈ క్రమంలో విశాఖ జిల్లాకు చెందిన వైసిపి నాయకులు ఎమ్మెల్యే అనితకు ఓటమి భయం పట్టుకుందని అన్నారు...

Related image

నిజంగా టీడీపీ అవినీతి చేయకపోతే జగన్ ప్రసంగం చేస్తున్న సమయంలో టిడిపి అవినీతి గురించి ప్రస్తావించిన సందర్భంలో ప్రజలనుండి ఎందుకు అంత రెస్పాన్స్ వస్తుందని ప్రశ్నించారు...విశాఖ జిల్లాలో ప్రతి సామాన్యుడికి తెలుసు ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏవిధమైన అవినీతి కార్యక్రమాలు చేశారని పేర్కొన్నారు విశాఖ వైసీపీ పార్టీకి చెందిన నాయకులు.



మరింత సమాచారం తెలుసుకోండి: