రాష్ట్రాన్ని మోసం చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని ఊరికనే వదిలిపెట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కర్నూలు జిల్లాలో జరిగిన టీడీపీ ధర్మపోరాట చేసిన చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీ పై ఎప్పుడూ ఎన్నడు లేనివిధంగా తన ప్రసంగంతో చెలరేగిపోయారు. రాష్ట్రానికి న్యాయపరంగా విభజన హక్కుల పరంగా రావలసిన ప్రతి హామీని కేంద్ర నెరవేర్చకపోతే తెలుగువాడి దమ్ము ఏమిటో చూపిస్తామని అన్నారు.

Image result for modi

ముఖ్యంగా రాష్ట్రానికి ప్రధాన హామీ అయినా ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానం చాలా దారుణమని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిందని ధర్మ పోరాట దీక్షలో ప్రజలకు తెలియజేశారు. అప్పట్లో భారతీయులు బ్రిటీష్ వాళ్లపై పోరాడినట్లే... బీజేపీపై తాము పోరాటం చేస్తామని చంద్రబాబు అన్నారు.  

Related image

పార్లమెంట్ టీడీపీ ఎంపీలు బెబ్బిలి పులుల్లా పోరాడారని ప్రశంసించారు. హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదని, హేతుబద్ధత లేని రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఢిల్లీలో దీక్ష చేశానని చంద్రబాబు అన్నారు. ఇక తన పరిపక్వతపై నరేంద్ర మోదీ సర్టిఫికెట్ తనకు అవసరం లేదని, అధికారం ఉంది కదా అని ఏం చేసినా చెల్లుతుందనుకోవడం సరికాదని ఆయన వ్యాఖ్యలు చేశారు.

Related image

ఏకపక్ష నిర్ణయాలతో దేశాన్ని పరిపాలించిన మోడీ రాబోయే రోజుల్లో గడ్డుకాలం ఎదుర్కొనబోతున్నారు అని పేర్కొన్నారు చంద్రబాబు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో బిజెపి పార్టీ పరిస్థితి ఎలా ఉందో రాబోయే రోజుల్లో దేశంలో అటువంటి పరిస్థితి ఉండబోతుందని ఈ క్రమంలో సంచలన కామెంట్ చేశారు బాబు గారు.




మరింత సమాచారం తెలుసుకోండి: