విజయ దేవరకొండ ఇప్పడూ ఇండస్ట్రీ లో మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరో తాజా గా వచ్చిన గీత గోవిందం సినిమా తో హిట్ కొట్టాడు. దీనితో మనోడి క్రేజ్ ఒక్క సారిగా పెరిగి పోయింది. తన మార్కెట్ చూస్తుంటే మిగతా హీరోలకు భయం పుడుతుంది. ఈమధ్య కాలంలో ఏ యువ హీరో అందుకోనంత రేంజ్‌ని అతి తక్కువ కాలంలోనే అందుకున్నాడు విజయ్‌ దేవరకొండ. పద్నాలుగు కోట్ల సినిమాను 60కోట్ల వసూళ్ల సినిమాగా చేసిన విజయ్ దేవరకొండ స్టామినా చూసి ఇప్పుడు టాలీవుడ్ అబ్బురపడుతోంది.


విజయ దేవరకొండ దెబ్బతో ఆ హీరోలకు గుండెల్లో రైళ్లు..!

అందుకే ఎన్నికోట్లు రెమ్యూనిరేషన్ ఇవ్వడానికైనా రెడీ అంటున్నారు చాలామంది నిర్మాతలు. నేరుగా విజయ్ తో పరిచయం లేని నిర్మాతలయితే, ఎవరైనా డేట్ ల అరేంజ్ చేయించగలిగితే ఎంతయినా కమిషన్ ఇస్తామని కూడా చెబుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మైత్రీ మూవీస్ కు విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను మూడుకోట్ల రెమ్యూనిరేషన్ మీద ఓకే చేసారు. దాని తరువాత కేఎస్ రామారావుకు ఓ సినిమా చేయాలి.


విజయ దేవరకొండ దెబ్బతో ఆ హీరోలకు గుండెల్లో రైళ్లు..!

ఇది కూడా పాత రెమ్యూనిరేషన్ తో ఒప్పుకున్నదే. దాని తరువాత మళ్లీ మైత్రీ మూవీస్ కు ఓ సినిమా మూడుకోట్ల రెమ్యూనిరేషన్ మీదే చేయాలి. ఆ తరువాత యువి-గీతాకు కంబైన్డ్ గా ఓ సినిమా చేస్తానని జస్ట్ మాట ఇచ్చాడు విజయ్. గీత గోవిందం రిజల్ట్ చూసి, తాము ఓకె చేసిన రెండు సినిమాలకు రెమ్యూనిరేషన్ పెంచి మంచి పారితోషికం ఇచ్చే ఆలోచనలో మైత్రీ అధినేతలు వున్నారు. రంగస్థలం అంత పెద్ద హిట్ అయిన తరువాత సుకుమార్ కు కూడా అలాగే ఇచ్చారు. ఆ విధంగా హీరోలు, డైరక్టర్లతో మంచి సంబంధాలను మైత్రీ నిలబెట్టుకుంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: