తెలుగుదేశం చైతన్య రధసారధి నందమూరి తారక రామారావు మూడవ తనయుడు నందమూరి హరికృష్ణ మరణవార్త చిత్ర పరిశ్రమను ఒక్కసారి బలమైన కుదుపుకు గురిచేసింది. నార్కట్ పల్లి-అద్దంకి హైవేపై రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ తీవ్రంగా గాయపడి, మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. తండ్రి మరణవార్త తెలిసిన హుటా హుటిన ఆసుపత్రికి చేరుకున్న ఆయన కొడుకులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు హరికృష్ణ మృతదేహాన్ని చూసి తట్టుకోలేకపోయారు. తల్లడిల్లి పోయారు హృదయ విదారకంగా బోరున విలపించారు.
జూనియర్ ఎన్టీఆర్ కి తన తండ్రి హరికృష్ణతో ప్రత్యేకమైన బావోద్వేగ భరితమైన అనుబంధం ఉంది. కొడుకులిద్దరూ తండ్రిని ప్రాణసమానంగా చూసుకుంటారు. వారి వివిధ సినిమా ఫంక్షన్లకు, ఆడియో ఫంక్షన్స్ కి తప్పని సరిగా తమ వెంట ఆయన్ను ఎంతో జాగ్రత్తగా నడిపిస్తూ తీసుకు రావటం మనం చూశాం.
బావోద్వేగ భరితమైన అనుబంధం
హరికృష్ణ తన పెద్ద కుమారుడు జానకిరామ్ ని పోగొట్టుకొని తల్లడిల్లుతూ విలపిస్తున్న సమయంలో "మీకు మేమున్నాం నాన్న" అంటూ హరికృష్ణకి ఎంతో ధైర్యాన్నిచ్చిన ఈ అన్నదమ్ములిద్దరు తమ తండ్రిని కోల్పోయి విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేసింది చూసిన వారిని కంటతడి పెట్టేలా చేస్తుంది.
జూనియర్ ఎన్టీఆర్ కుర్చీలో కూర్చొని రోదిస్తుండగా, అతడిని నారా లోకేష్ సముదాయిస్తున్న ఫోటోలు ఇప్పుడు అంతర్జాలంలో బయటకి వచ్చాయి. ఎన్టీఆర్ ఏడుస్తున్న ఈ ఫోటోలు చూసిన అభిమానులు మరింత భావోద్వేగానికి గురవుతున్నారు. తమ జీవితంలో అత్యంత ముఖ్యమైన జీవనప్రధాతని కోల్పోయి విలపిస్తున్న అన్నదమ్ములు వారి కుటుంబాలు ఈ ఉవేగం నుండి త్వరలోనే కోలుకోవాలని కోరుకుందాం!
జూనియర్ ఎన్టీఆర్ను ఆలింగనం చేసుకుని కేసీఆర్ ఓదార్చారు. ఎన్టీఆర్కు ధైర్యం చెప్పారు
తన అన్న హరికృష్ణ మరణవార్త విని నందమూరి బాలకృష్ణ కంటతడి పెట్టారు. ఆయన మరణ వార్త విని ఒక్కొక్కరుగా కామినేని ఆసుపత్రికి చేరుకున్నారు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, బాలకృష్ణ ఇలా హరికృష్ణ కుటుంబ సభ్యులు వేర్వేరుగా హాస్పిటల్ కి వెళ్లారు.
బావోద్వేగ భరితమైన అనుబంధం వ్యక్తీకరణం
హరికృష్ణ పార్థివదేహాన్ని వీక్షించిన బాలకృష్ణ ఉద్వేగానికి లోనయ్యారు. కంటతడి పెడుతూ అసలు ఎలా జరిగిందనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.