నందమూరి ఎన్టీరామారావు తనయుడు హరికృష్ణ అకాల మరణం తెలుగు ప్రేక్షకులని తెలుగు రాష్ట్రాలలో ఉన్న తెలుగువారిని
ఎంతో కలిచివేస్తోంది..తండ్రిని ఎంతో అభిమానిస్తూ ప్రేమించే వ్యక్తిగా హరికృష్ణ కి
ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టాయి..అయితే హరికృష్ణ చిన్నతనం నుంచే సేవాభావం
కలిగి ఉండేవారని..కష్టాలలో ఎవరన్నా ఉంటే తట్టుకోలేక పోయేవారని ఆయన స్నేహితులు అంటున్నారు..అంతేకాదు
మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకునే వరకూ ఆయన కట్టుబడి ఉండేవారని భంధువులు స్నేహితులు
చెప్తూ కన్నీటి పర్యంతం అవుతున్నారు..
తన పుట్టిన రోజు మరో నాలుగు రోజుల్లో ఉండటంతో ఆయన మీడియాకి విడుదల చేసిన లేఖ బయటకి వచ్చి ఆ లేఖలో సారాంశం తెలుసుకున్న అభిమానుల భావోద్వేగాలని ఆపడం ఎవరికీ సాధ్యం కాని పని..అయితే ఇప్పుడు ఆయన ప్రాణ స్నేహితుడు చెప్పిన మరొక వార్త విన్న వారు ఎవరైనా సరే హరికృష్ణ ఉదారత.. మంచితనానికి హ్యాట్సాఫ్ చెప్పకుండా మానరు..పైకి గంభీరంగా కనిపిస్తున్న హరికృష్ణ మనసు ఇంత సున్నితంగా ఉంటుందా అని ఆశ్చర్యపోతారు..ఇంతకీ తన స్నేహితుడు ఏమి చెప్పాడంటే..
నందమూరి హరికృష్ణ కి హైదరాబాద్ అబిడ్స్ లో ఆహ్వానం అనే పేరుతో ఒక హోటల్ ఉంది దానిని హరికృష్ణ తన స్నేహితుడికి లీజుకు ఇచ్చారట..ఈ హోటల్ ప్రాంగణంకు హరికృష్ణ తరుచు వచ్చేవారు. ఈ హోటల్లో 1001 నెం గల రూమ్ ఆయనకీ కేటాయిన్చిందే హైదరాబాద్ వచ్చిన ప్రతీసారి ఆయన అక్కడే ఉండేవారు..అయితే తన స్నేహితుడు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాడనే విషయం తెలుసుకున్న ఆయన అతడిని పిలిపించి రెండు నెలల క్రితం దీనిని ఆయనకు ఇచ్చారట.
తన స్నేహితుడు ఇబ్బందుల్లో ఉంటే మనమే ఆదుకోవాలి అంటూ స్నేహితుడిని తన ఇంటికి పిలిపించుకొని, ఇబ్బందుల్లో ఉన్నావని..బాధపడవద్దని, తనకు తోచిన సహాయం చేస్తానని చెప్పి ఆ హోటల్ ని లీజుకు ఇచ్చారట ఇప్పుడు ఆ హోటల్ బాగా నడుస్తోంది..అయితే ఈ విషయాన్ని ఈ సందర్భంగా పంచుకున్న హరికృష్ణ స్నేహితుడు కృష్ణారావు కన్నీరు మున్నీరు అవుతున్నారు...తాను కావలికి వెళ్తున్నానని, తిరిగ వచ్చేందుకు ఆలస్యం అవుతుందని, తన కోసం ఎదురు చూడవద్దని కూడా చెప్పారట..ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మరింత భావోద్వేగాలకి లోనవుతున్నారు.