తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు నాలుగో కుమారుడు నందమూరి హరికృష్ణ ఇటీవల శుభకార్యానికి వెళుతూ నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. హరికృష్ణ మరణంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు తెలుగుదేశం కార్యకర్తలు అలాగే సినిమా రంగానికి చెందినవారు...నందమూరి కుటుంబ సభ్యులు ఎంతగానో బాధ పడ్డారు.

Image result for harikrishna ysr

ఈ క్రమంలో ఆయనతో టైగర్ హరిశ్చంద్రప్రసాద్ అనే సినిమాను తీసిన దర్శకుడు వి.సముద్ర తాజాగా సెన్సేషనల్ న్యూస్ ఒకటి బయట పెట్టారు. అప్పట్లో హరికృష్ణతో టైగర్ హరిశ్చంద్రప్రసాద్ తీసిన సినిమా రైతు సమస్యల నేపథ్యంలో తీసిన సినిమా అని పేర్కొన్నారు. ఈ సినిమా కోసం తాను పోసాని కృష్ణమురళి కలిసి ఎంతో పరిశోధన చేసి రైతుల సమస్యలపై సినిమా చేసాము అన్నారు వి.సముద్ర.

Image result for harikrishna ysr

ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవర్ లో ఉన్న చంద్రబాబు పాలనలో అప్పటి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఈ సినిమాలో చక్కగా చూపించారని అప్పటి ప్రతిపక్ష నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రత్యేకంగా నందమూరి హరికృష్ణ కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు అని దర్శకుడు వి.సముద్ర ఈ సందర్భంగా తెలియజేశారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వస్తుందని ఇటువంటి సమస్యలు రైతులకు ఉండవని కూడా అన్నారట వైయస్.




మరింత సమాచారం తెలుసుకోండి: