ఆయన వైఎస్సార్ భక్తుడు. పైగా తన ప్రాంతంలో మంచి పట్టున్న నాయకుడు. అధికార పార్టీ ప్రలోభాలను సైతం పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేసిన ఎమ్మెల్యే.  మరి, అటువంటి నాయకుడు సొంత పార్టీపైనే  ఇపుడు నిప్పులు  చెరుగుతున్నారు. రాజీనామా ఛేస్తానని అంటున్నారు. ఇది షాకింగ్ న్యూసే మరి


సంచలన వ్యాఖ్యలు :


విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర ఈ రోజు మీడియా ఎదుట  సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను  పూర్తిగా విసిగిపోయానని, ఇక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఏపీలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ రెండూ ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సాలూరు మండలం కరాసువలసలో 15 రోజుల్లో 9 మంది జ్వరాలతో చనిపోయారు... వీటిపై వైసీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు నోరు ఎత్తడం లేదని రాజన్న దొర హాట్ కామెంట్స్ చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదన్నారు. 


డెడ్ లైన్ :


సాలూరులోని జ్వర మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని రాజన్న దొర ఓ రేంజిలో ఫైర్ అయ్యారు. ఎవరికీ ఇవి పట్టకపోవడం దారుణాతిదారుణమని అన్నారు. ఈ అంశంపై  మూడు రోజుల్లో అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్ష వైసీపీ  స్పందించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ రాజన్న దొర ప్రకటించారు. మొత్తానికి మెత్తగా కనిపిస్తూనే రాజన్న దొర పెద్ద  బాంబు వేశారు. ఆయన డెడ్ లైన్ తో వైసీపీకి చిక్కులు ఖాయమని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: