ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ముఖ్యమంత్రి అయిన జేడీఎస్ అధినేత కుమార్ స్వామి..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో భేటీ అయ్యారు. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కింగ్ మేకర్ అవుతారనుకున్నా కుమారస్వామి అందరికీ షాకిచ్చి కింగ్ ఇవ్వడం ఒకింత అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Related image

ఈ క్రమంలో తాజాగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన కర్ణాటక సీఎం కుమారస్వామి  విజయవాడలోని గేట్ వే హోటల్‌లో చంద్రబాబు తో సమావేశం అయ్యారు. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు...మర్యాదపూర్వకంగానే తాను కుమారస్వామితో భేటీ అయ్యానని తెలిపారు.

Image result for chandrababu kumaraswamy

ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని.. దక్షిణాదిలోని అన్ని పార్టీలు కలవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మరోసారి తామిద్దరం భేటీ కావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇదే క్రమంలో కుమార్ స్వామి ఇంద్ర కీలాద్రి పైనున్న కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు.

Related image

అయితే మరోపక్క కుమార్ స్వామి - చంద్రబాబు అయినా బేటి విషయమై జాతీయ రాజకీయాలలో అనేక చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వీరిద్దరి భేటీ గురించి ఢిల్లీ బీజేపీ పెద్దలు... సమాచారం ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.




మరింత సమాచారం తెలుసుకోండి: