ఇటీవల తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లాలో నారా హమారా టిడిపి హమారా అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది . ఈ క్రమంలో కొందరు ముస్లిం యువకులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన టిడిపి అధినేత చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో ప్లకార్డులు ప్రదర్శించి ఆందోళనలు నిరసనలు తెలపడం జరిగింది...దీంతో వెంటనే అక్కడ ఉన్న కొంతమంది పోలీసులు ఆందోళనలు చేస్తున్నా ముస్లిం యువకులను అదుపులోకి తీసుకుని దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది.

Image result for JAGAN MUSLIMS

అయితే ఈ సభ అయిన వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులు...ఇటువంటి దారుణమైన పనులు చేసేది వైసీపీ పార్టీ అని విమర్శించారు. ఇదే క్రమంలో గుంటూరు జిల్లా ముస్లింలు కూడా వైసిపి పార్టీ పై తమ వ్యతిరేకతను చూపుతున్నారు. నారా హమారా - టీడీపీ హమారా సభలో వైసీపీ కుట్రలకు వ్యతిరేకంగా శనివారం జిల్లాలో ముస్లిం సోదరులు ఆందోళనకు దిగారు. నగరంలో నిరసన ర్యాలీ చేపట్టారు.

Image result for JAGAN MUSLIMS

మార్కెట్‌లోని గాంధీ విగ్రహం నుంచి బస్టాండ్ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్ కుట్ర రాజకీయాలకు ముస్లిం సోదరులు బలికావద్దని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు.

Image result for NARA HAMARA MUSLIMS

మరోపక్క వైసిపి పార్టీ మాత్రం ...చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం ముస్లింలకు న్యాయం జరగదంటూ.. ‘‘నారా హఠావో- ముస్లిం బచావో’’ పేరిట వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నరు. ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్న జిమ్మిక్కులు అన్ని ఎన్నికల కోసం అని పేర్కొన్నారు...అంతేకాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలలో మీకు మేలు చేసింది ఎవరిని ఏ ముస్లిం కుటుంబాన్ని అడిగిన కచ్చితంగా వైఎస్సార్ పేరు చెప్తారని గర్వంగా చెప్పారు వైసీపీ పార్టీ నాయకులు.




మరింత సమాచారం తెలుసుకోండి: