అసలు మానేజ్మెంట్ అనేది ఒక అద్భుత ప్రక్రియ - తనకు కావలసిన దానిని తనకు కావలసిన రీతిలో సాధించుకునే ప్రక్రియ ను ఆధునిక కాలంలొ మానేజ్మెంట్ అంటు న్నారు. అయితే ఈ ప్రక్రియలో ఏపి ముఖ్యమంత్రి మహానిష్ణాతుడు. దీనికి డాక్టరేట్స్ ఇవ్వాలంటే ఒక్క చంద్రబాబుకే ప్రపంచంలో ఉన్న డాక్టరేట్స్ సరిపోవు.


ఈ దేశంలో ఎవరు ఏ అద్భుతం సాధించినా దాని తానే చేశానని లేదా చేయించేశానని ఎంతటి వారినైనా నమ్మించి మాయ చేసేయగలరు. ఉదాహరణకు సత్యనాదేళ్లకు ఐఏఎస్ కాదు - ఐటి స్టడీస్ కు వెళ్లమని ఉద్భోదించినది తానే నని బహిరంగ వేదికపై ప్రవచించారు. అది ఆనాడు ర్రాష్ట్రమే కాదు దేశమంతా మార్మోగేలా చేసింది చంద్రబాబు పోషణలో పెరిగిన మీడియా. ఆ తరవాత అది నిజం కాదు అని వచ్చిన వార్త సాక్షి ఘోషించినా కొంతదూరమే వినిపించింది. అదీ మీడియా మీ చేతులో ఉంటే ప్లే చేసిందే ప్లే చేసి గోబెల్ ప్రచారం చేస్తే ఈ తరం కాకపోయినా మరో తరానికి చేరుతుంది.


ఇప్పుడు జనం ముదిరారు తెలుగువాళ్ళ సహనం నశించింది. ఆధునిక గోబెల్ గా చంద్రబాబును జనం గుర్తించారు. తన మద్దతు మీడియాలో ఏదైన బాబు గారి గొప్పలు రాస్తే  వెనువెంటనే "సోషల్ మీడియా"  వేటేస్తుంది. టిడిపి కోసం పనిచేసే మీడియా ఆంధ్రప్రదేశ్ కు చేస్తున్న ద్రోహానికి కొన్నిసార్లు సామాజిక సమాచార మాధ్యమం చెక్ చెపుతూనే వస్తుంది. దాంతో తెలుగుదేశం మద్దతు మీడియా చానళ్లు చేప్పేవి నిజమెనా? అని ప్రజలు చెక్ చేసుకోవటంతో చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ ఇప్పుడు తెలుగు ప్రజలకు జోకింగ్ - స్టాక్ అయిపోయారు. ఈ జొకింగ్ ప్రచారకర్తలుగా, ప్రచారయానంగా టిడిపి మద్దతు మీడియా స్థాయి తగ్గింది.


chicago state university doctorate to chandrababu కోసం చిత్ర ఫలితం


తెలుగుప్రజల్లో గోచరమౌతున్న మార్పు - ఇక్కడ గోబెల్స్ ప్రచారానికి ప్రజలు నవ్వుకుంటూ స్పందించటం మానేశారు.  అందు కే తన మానేజ్మెంట్ ప్రక్రియను విదేశాల కు ఆపై అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళారు బాబు.




ఉదాహరణకు "చికాగో స్టేట్ యూనివెర్సిటి ఏపి సిఎం చంద్రబాబు గారికి డాకటరేట్ ప్రకటించగా మాద్దతు మీడియా మాత్రం "చికాగో యూనివర్సిటీ" గా ప్రచారం చేసింది. దాంతో చికాగో యూనివర్సిటి ఒక ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ అని, అది అలాంటి డాక్టరేట్ ప్రసాధించలేదని సోషల్ మీడియా కోట్ల గొంతులతో స్పందిస్తూ అసలు నిజం బయట పెట్టింది. ఆ అవార్డ్ "చికాగో స్టేట్ యూనివర్సిటీ" అని దానికంత దృశ్యం లేదని ఏవరో తెలుగు మేడియేటర్ ద్వారా ఆ ప్రయోజనాన్ని పోండటానికి మానేజ్ చేశారని తెలిసిన నాటి సమాచారం.




ఇక అసలు విషయం “మీడియా మానేజ్మెంట్ టెక్నిక్” ఉపయోగించి “యు ఎన్ ఓ” నే మాయ జేసిన వైనం: వైసిపి వ్యాఖ్యలు  


చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, అంతే కాదు, ఈ పదవుల్లోకి రావడానికి ఆయన పన్నిక పన్నాగాలు, ఎత్తుగడలు, జిత్తులు, మోసాలు, మాయోపాయాలు, రాజకీయ చతురతలు అన్నీ తెలుగు వారందరికి సుపరిచితమే. అందుకే ఆన్నిపార్టీల వారు చంద్రబాబునాయుడితో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు.


NTR was bacjk stabbed by chandrababu కోసం చిత్ర ఫలితం


కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత - అమిత్ షా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాతే బాబు జోరుకు కళ్లెం పడింది. అయినా ఆయన తన ఎత్తులు - జిత్తులు ఎక్కడో ఒక చోట ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడి వ్యూహాలకు కాలం చెల్లడంతో ఆయన తన దృష్టిని అంతర్జాతీయ స్ధాయికి తీసుకువెళ్లారు. అంతర్జాతీయంగా ముందు ప్రణాళికతో చేసిన మీడియా మానేజ్మెంట్ ప్రక్రియ ద్వారానే ఐక్య రాజ్య సమితి నుంచి ఆహ్వానం అందుకున్నారని ప్రతిపక్ష వైసిపి చెపు తుంది.


chandrababu negetive attitude towards agriculture & his comments కోసం చిత్ర ఫలితం


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రకృతి సేద్యానికి,  ఎలాంటి రసాయనాలు - ఎరువులు వాడకుండా ప్రక్రతి సిద్ధమైన వ్యవసాయాన్ని చేస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకొంటున్న చొరవకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ విషయంలో మార్గదర్శనం చేయాలని ఐక్యరాజ్యసమితి నుంచి ముఖ్యమంత్రికి ఆహ్వానం అందింది. 2024 కల్లా రాష్ట్రంలో న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం 60లక్షల మంది రైతులను ఈ సాగువైపు మళ్లించడానికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నా లకు సహకరిస్తామని తెలిపింది. ఈ లేఖను "ఐరాస ఎన్విరాన్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, ఎరిక్‌ సోల్హీం" పంపారు. ఈ సందర్భంగా ఈ నెల 24న నిర్వహిస్తున్న ఆర్థిక సుస్థిరత, వ్యవసాయంలో సవాళ్లు, అవకాశాలు అనే అంశంపై నిర్వహించే సదస్సులో కీలకోపన్యాసం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించింది.


చంద్రబాబు నాయుడు తన గొబెల్స్ ప్రచారాన్ని రాష్ట్రాలకే కాదు,  జాతీయ స్ధాయికే కాదు, అంతర్జాతీయ స్ధాయికి కూడా వాడుకుంటున్నారని వైసిపి నాయకుడు ఎం.వీ.ఎస్ నాగిరెడ్డి విమర్శిస్తున్నారు. అంతేకాదు ఏడాదికి 2500 కోట్లు కేటాయించి 2024 సంవత్సరానికి రాష్ట్రంలో 60లక్షల ఎకరాల్లో ప్రక్రతి సిద్ధమైన వ్యవసాయాన్ని చేపట్టడమే లక్ష్యంగా చంద్రబాబు పని చేస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ ప్రశంసించింది. అదే చంద్రబాబునాయుడికి  ఐరాస ఆహ్వానం అందేందుకు అదే కారణం అయిందని ప్రతిపక్ష వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. 


MV Nagireddy YCP leader కోసం చిత్ర ఫలితం


సెప్టెంబర్ 24 తేదిన ఐరాస లో ప్రపంగించేందుకు చంద్రబాబు నాయుడు తన పరివారంతో కలిసి వెళ్లనున్నారు. ఇక్కడే చంద్రబాబు నాయుడి చతురత కనిపిస్తుంది.


ఇంతకీ విషయం ఏమిటంటే వ్యవసాయం దండగని, పనికి మాలినదని ప్రకటించిన చంద్రబాబును వ్యవసాయరంగం గురించి ప్రసంగించాల్సిందిగా  ఐరాస ఆహ్వానించింది. ఇదెంత అంతర్జాతీయ అనౌచిత్యమో కదా! అంతా చంద్ర మాయ అంటున్నాయి ప్రతిపక్షాలు.  


గతంలో చంద్రబాబు వ్యవపాయ వ్యతిరేక విధానాల కారణంగా రైతులు ఎంత ఇబ్బందులు పడ్డారో తెలుగు ప్రజలకు తెలుసు నని - అలాంటిది ఇప్పుడు అంతర్జాతీయ స్ధాయిలో ఆయనకు గుర్తింపు రావడం ఆశ్చర్యం కలిగిస్తోందని వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. అంతే కాదు, ఏకంగా ఐరాసనే చంద్రబాబు ఏమార్చేశారని అంటున్నారు. 


అన్నింటినీ మించి ముక్కారు పంటలు పండే వ్యవసాయ సుక్షెత్రాన్ని సుమారు 35000 ఎకరాలను నాశనం చేసి రాజధాని అమరావతి నిర్మిస్తున్నారంటేనే పర్యావరణ వినాశనానికి, ఆహార పంటల ఉత్పత్తి నిరోధకానికి రైతుల పతనానికి నిరంతరం శ్రమించే చంద్రబాబు, వ్యవసాయం దండగని, పనికి మాలినదని ప్రకటించిన చంద్రబాబు నాయుడ్ని వ్యవసాయరంగం గురించి ప్రసంగించాల్సిందిగా ఏ విధంగా ఐరాస ఆహ్వానించిందనేది ప్రజాబాహుళ్యంలో అనుమానం తలెత్తేలా చేసింది. అంతే కాదు గ్రౌండ్ రియాలిటీ కనీసం తెలుసుకోకుండా ఐరాస - జస్ట్  న్యూయార్క్ టైమ్స్ లో వ్యాసానికే పడిపోతుందా? అనెది చర్చనీయాంశమే కాదు వివాదాశం కూడా అవుతుంది

 uno headquarters కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: