"ప్రగతి నివేదన సభ" ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నాటి నుంచి మంత్రి హరీష్ రావు పేరు ప్రతి చోటా వినిపించింది. దీనికి తగ్గట్టు ఆయన ఊసేక్కడా కూడా కనిపించ లేదు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి తెలంగాణా రాష్ట్రంలో  టిఆరెస్ ప్రభుత్వ ఏర్పాటు వరకూ ప్రతి కార్యక్రమంలో హరీష్ రావు చొరవ కొట్టొచ్చినట్లు కనిపించేది.  దీనికి భిన్నంగా గడిచిన కొద్దికాలంగా, హరీష్ రావును ఆయన జిల్లాకు పరిమితం చేయటం తెలిసిందే. "ప్రగతి నివేదన సభ" తో కెసిఆర్ పై ఇంట్లోనే అసంతృప్తి జ్వాలను కేసిఆరే స్వహస్తాలతో అగ్గిరవ్వతో అంటించినట్లైంది. 

trouble shooter harish rao కోసం చిత్ర ఫలితం

కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకు మంత్రి హరీష్ రావును దూరం పెట్టారా? అంటే అవును అనే అంటున్నాయి తెరాసలోని ఆయన వర్గాలు. మంత్రి కేటీఆర్ అన్నిటా తానై సభ ఏర్పాట్లలో బిజిగా ఉండగా, సీనియర్ మంత్రి హరీష్ రావు ఇవేమి అంటీ ముట్టనట్టు తన నియోజకవర్గంలోను, పక్క నియోజకవర్గం లోను పర్యటిస్తున్నారు.

trouble shooter harish rao కోసం చిత్ర ఫలితం

ముందస్తు ఎన్నికలకు సన్నాహంగా నిర్వహిస్తున్న ఈ సభ విజయవంతం చేసి దానిని కేటీఆర్ ఖాతాలో వేయ్యాలని పథకం. దానికోసమే వ్యూహాత్మకంగా హరీష్ రావును పక్కన పెట్టారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు అన్ని ఉప ఎన్నికలలో హరీష్ రావుకు విశేష ప్రాధాన్యత ఇచ్చారు, ఆ తర్వాత తగ్గింది, ఇప్పుడు సభ ఏర్పాట్ల కమిటీలో కూడా హరీష్ రావుకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదు.



గ్రేటర్ హైదరాబాద్ కు జరిగిన కార్పొరేషన్ ఎన్నికల సందర్భం లోనూ మంత్రి కేటీఆర్ ను ప్రమోట్ చేయటం, హరీష్ రావును పూర్తిగా పక్కన పెట్టటం అనేకంటే నిర్లక్ష్యం చేయటం అప్పట్లో వివాదాస్పద  విషయంగా, చర్చనీయాంశంగా, హాట్-టాపిక్ గా మారింది. ఆ తర్వాత కూడా హరీష్ రావును పక్కన పెట్టటం కేటీఆర్ ను ప్రమోట్ చేయటం అనియంత్రితంగానే జరిగి పోయింది.  తన తర్వాత, తన రాజకీయ వారసుడు కేటీఆర్ అన్న విషయాన్ని తన నిర్ణయాలతో ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం చేశారు కేసీఆర్. అదే రాజవంశంలో ఇరువురు హేమాహెమాల మద్య అఘాదం స్వయానా మహరాజే సృష్టించి నట్లైంది.  


దీనికి తగ్గట్లే జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు హైదరాబాద్ నగరానికి వచ్చినప్పుడు కేటీఆర్ కు ప్రాధాన్యత లభించటం హరీష్ రావు ఊసే లేకపోవటమనేది మాత్రం యాదృచ్చికం కాదు. ఇది అంతకంతకూ పెరుగుతూ నేడు తాజాగా నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సదస్సులో విశ్వరూపం సంతరించుకొంది. ప్రగతి నివేదన సభ మొత్తం కేటీఆర్ కేంద్రంగా సాగటం జరిగింది. హరీష్ రావుకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవటంపై ఆయన వర్గంలో ఆగ్రహం పెల్లుబికిందన్న విషయం పరిచయం ఉన్న వారికి స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.  



ఆశ్చర్యకరంగా ఎప్పుడూ ఎన్నడూ లేనట్లుగా  "సోషల్ మీడియా లోనూ హరీష్ రావు మీద సానుభూతి వెల్లువైంది"  టీఆర్ఎస్ లో మొదట్నించి కష్టపడి పనిచేసిన హరీష్ రావును అతి సునాయాసంగా కూరలో కరివేపాకులా పక్కన పెట్టేయటా న్నెవరూ సహించలేక పోతున్నారు. ఇంత దుర్మార్గం ఏమిటన్న ప్రశ్న చాలామంది సభాసదుల్లో నుండే వినిపించింది. టీఆర్ఎస్ కు ట్రబుల్ షూటర్ అయిన హరీష్ రావును తాజా సభ విషయంలో పక్కన పెట్టేయటంతో ఆయన వర్గానికి చెందిన నేతలు ఎవరూ చురుకుగా స్పందించటం లేరనేది అందరికీ విదితమే. అధినేత కెసిఆర్ ఆగ్రహానికి గురికాకుండా ఉండేలా సభా ఏర్పాట్లలో పాల్గొన్నారే కానీ మనసుపెట్టి చేయలేదన్న మాట వినిపిస్తోంది.
pragati nivedana sabha harish rao vs KTR కోసం చిత్ర ఫలితం
ఇదిలా ఉంటే, ఈ రోజు మధ్యాహ్నం నిర్వహించిన కేబినెట్ సమావేశం తర్వాత,  సమావేశంలో నిర్వహించిన అంశాల్ని వెల్లడించేందుకు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశ మందిరం లోకి తొలుత హరీష్ రావు రావటం, ఆయన వెనుక వరుసగా పలువురు మంత్రులు వచ్చారు. అందరితో పాటు హరీష్ రావు ఒకరుగా కనిపించారే తప్ప  ఆయనకు ఎలాంటి ప్రత్యేకతగాని ప్రాముఖ్యతగాని ఉన్నట్లు కన్నిపించలేదు.
pragati nivedana sabha harish rao vs KTR కోసం చిత్ర ఫలితం
తనకు అప్పగించిన నాలుగు మాటలు మాట్లాడిన హరీష్ రావు మౌనంగా ఉండి పోయారు తప్ప ముఖంలో సాధారణ చురుకుదనం కనిపించలేదు. ప్రగతి నివేదన సభ వేదిక మీద కూర్చున్న హరీష్ రావు వైపు కెమేరాలు ఎక్కువసేపు పోకస్ చేయటం కూడా  కనిపించింది. కొంత  గంభీరంగా ఉన్నట్లుగా హరీష్ రావు కనిపించారు.ఎప్పుడూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండే హరీష్ రావు అలా నేడు లేకపోవటం, ఇంత పెద్ద బహిరంగ సభ నేపథ్యంలో కనిపించాల్సిన హడావుడి, సందడి సందోహం గాని  ఆయనలో అస్సలేమీ చూపరులకు కనిపించలేదు.
KTR in pragati nivedana sabha కోసం చిత్ర ఫలితం
నిస్సారంగా నిస్తేజంగా - తేజస్సు కోల్పోయిన రీతిలో హరీష్ రావు కనిపించారు. అదే సమయంలో, మంత్రి కేటీఆర్ చెమటలు కారుతూ, ముఖం అలసటతో బహుభారం మోస్తున్న వానిలా భారంగా ఉండటం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. "ప్రగతి నివేదన సభ" లో హరీష్ రావుకు ప్రాధాన్యత యివ్వలేదన్న విషయం, ఆయనకు కేటాయించిన విధుల్ని చూస్తే అర్థమవుతుందని అంతర్జాలం వెల్లువెత్తుతుంది. 

ముందస్తు ఎన్నికలలో తెరాస భారీ విజయం సాధిస్తే, కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసి కేసీఆర్ పూర్తిస్థాయిలో జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తారని సమాచారం. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక సీట్లు సాధించి కేంద్రంలో ఏర్పాటు కాబోయే తరువాతి ప్రభుత్వం కీలక భూమిక పోషించాలని ఆయన వ్యూహం.

మరింత సమాచారం తెలుసుకోండి: