తిరుమల శ్రీవారి ప్రాణదానం ట్రస్టుకి భారీ విరాళం అందింది. భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త  ముకేశ్‌ అంబానీ భారీ విరాళంను అందజేశారు.  తిరుమల శ్రీ వెంకటేశ్వరునిపై తనకు ఉన్న భక్తి మరో సారి చాటి చెప్పుకున్నారు. తాజాగా ఆయన వెంకన్నకు రూ. 1,11,11,111 మొత్తాన్ని భారీ విరాళంగా ఇచ్చారు.   శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు ఆయన ఈ భారీ విరాళాన్ని ప్రకటించారు. 
Image result for mukesh ambani donates tirupati
కాగా,  దేశంలో ప్రాణాపాయంలో ఉన్న రోగులకు ఈ విరాళాన్ని ఖర్చు చేయాల్సిందిగా ఆయన ట్రస్టు ని కోరారు.  ఈ నేపథ్యంలో సంస్థ ప్రతినిధి ఒకరిని తిరుపతికి పంపించి..విరాళాన్ని అందించారు. తిరుమలలోని దాతల విభాగంలో ఈ విరాళం చెక్కును అధికారులు స్వీకరించారు. 
Related image
ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరైనా ముఖేష్ అంభాని దేశంలోని ప్రముఖ దేవాలయాలు సందర్శించి విరాళాలు ప్రకటించడం చూస్తూనే ఉన్నాం. అయితే ముఖేష్ కుటుంబ సభ్యులు  పలుమార్లు శ్రీవారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకుంటారు..అంతే కాదు  కోట్లాది రూపాయలను విరాళంగా సమర్పించిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: