వైసిపి అధినేత ప్రతిపక్ష నేత పై మండిపడ్డారు నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా. ప్రజా సమస్యలపై పోరాడ లేనివాడుఅధికారంలోకి వస్తే ఏం చేస్తాడు అని జగన్ ని ఉద్దేశించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు విషయం గురించి మాట్లాడుతూ...జగన్మోహన్ రెడ్డి తాను సీఎం అయ్యాక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాడు అని చెపుతున్న మాటలు కల్లబొల్లి మాటలు అని పేర్కొన్నారు.

Image result for devineni uma jagan

తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి 58 శాతం పనులు పూర్తయ్యాయని….త్వరలో 12 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని స్పష్టం చేసారు. పోలవరం నిర్వాసితులకు అన్ని రకాలుగా న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. జగన్‌ కూడా వెళ్లి పోలవరం ప్రాజెక్టు చూసి రావాలని మంత్రి సూచించారు.

Image result for devineni uma jagan

రాష్ట్రంలో ఏం జరుగుతుందో జగన్‌ తెలుసుకోవాలన్నారు. జగన్‌.. నీ దుకాణం మూసెయ్యి.. వైసీపీకి టూ లెట్‌ బోర్డు పెట్టే సమయం వచ్చేసింద్ణని ఆయన అన్నారు. వైసీపీకి పార్లమెంట్‌ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు దొరకడం లేదన్నారు. చిలకలూరిపేట, మైలవరం టికెట్‌లను ఇప్పటికే అమ్మేశారని మంత్రి దేవినేని ఉమ అన్నారు. జగన్ ఎన్ని పాదయాత్రలు చేసినా అధికారంలోకి రాలేడని అన్నారు. ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో పోరాడ లేనివాడు...ఎన్నికలలో కూడా పాల్గొన కుండా ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు దేవినేని ఉమ.




మరింత సమాచారం తెలుసుకోండి: