అపుడెపుడో కవి బాలగంగాధర తిలక్ అన్నారు. ఈ దేశంలో గజానికో గాంధారీ పుత్రుడు అంటూ. అదే వరసలో జగన్ బాబు జమానాను పోల్చారు. ఈ పాలనలో గజానికో కబ్జా కోరు తయారయ్యారని ఫైర్ అయ్యారు. భూమి కనిపిస్తే చాలు అమాంతం మింగెస్తున్నారని, ఈ భూ బకాసురులను ఓటు అనే ఆయుధంతోనే అంతమొందించాలని పిలుపు ఇచ్చారు. ఈ రోజు జగన్ విశాఖ జిల్లా సబ్బవరంలో జరిగిన భారీ సభలో మాట్లాడారు.


ల్యాండ్ పూలింగ్ తో చెవిలో పూలు :


విశాఖ భూ కబ్జాలకు నిలయంగా మారిందని జగన్ అన్నారు. పేద వారి భూములను సైతం దోచేశారని మండిపడ్డారు. పెందుర్తిలో అమ్మడానికే వీలు లేని అసైండ్ భూములను టీడీపీ తమ్ముళ్ళు తక్కువ ధరలకు కొనేసి బీద వారి నోట్లో మట్టి కొట్టారని జగన్ అటాక్ చేశారు. పైగా దానికి ల్యాండ్ పూలింగ్ అని పేరు పెట్టి రైతుల నోట్లో మట్టి కొట్టారని అన్నారు.  ఇదేనా పాలన అంటే అంటూ ఆయన  నిలదీశారు. జిల్లాలో ఎక్కడ చూసినా భూముల స్కాములే కనిపిస్తున్నాయని అన్నారు.


బాబుల మద్దతుతోనే :


భూ దందాలకు పెదబాబు చినబాబు మద్దతుగా ఉన్నారని జగన్ ఆరోపించారు. వారి అండ చూసుకునే రెచ్చిపోతున్నారని అన్నారు. ఎక్కడా కూడా కనీసం గజం జాగా కూడా వదలకుండా మెక్కేశారని విరుచుకుపడ్డారు. ఈ భూ దందాలకు అంతు పొంతూ లేకుండా పోయిందని, పేదలను దిక్కు లేని వళ్ళను చేశారని జగన్ ఫైర్ అయ్యారు. పెందుర్తి నడి బొడ్డున మహిళ‌లపై దాడులు జరిగినా చంద్రబాబు ప్రభుత్వం చూస్తూ ఉండిపోయిందని జగన్ అటాక్ చేశారు. 

భారీగా జనం హాజరైన ఈ మీటింగ్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇలాకాలో జరగడం విశేషం. జగన్ సభ రీ సౌండ్ కి తమ్ముళ్ళ గుండెలదిరేల సభ సాగిందని వైసీపీ హ్యాపీగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: