తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు రెడీ అయిపోయిన విషయం మనకందరికీ తెలిసినదే. 2014 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ విషయంలో కీలకంగా వ్యవహరించి ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో విజయం సాధించి తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యారు కెసిఆర్.
ఈ క్రమంలో కేసీఆర్ తనదైన శైలిలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ని దేశంలో ఉన్న అత్యున్నత రాష్ట్రాలకు పోటీగా తీర్చిదిద్దడంలో సఫలీకృతం అయ్యారు. ముఖ్యంగా అంతర్జాతీయ వ్యాపార సదస్సు సమయంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన తీరు ప్రపంచ దేశాలకి అబ్బురపరిచింది అనటంలో ఎటువంటి సందేహం లేదు.
అంతేకాకుండా తన హయాంలోనే హైదరాబాద్ నగరానికి మెట్రో ట్రైన్ సర్వీస్ తీసుకువచ్చారు కేసీఆర్. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కెసిఆర్ ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ అవార్డుకు ఎంపికయ్యారు. 27న ముంబైలో జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనాలని కేసీఆర్ కు ఆహ్వానం అందింది.
ఎకనామిక్ టైమ్స్ గ్రూప్ ఎండీకి సీఎం కేసీఆర్ కృతజ్నతలు తెలిపారు. ఇది నాకు వ్యక్తిగతంగా వచ్చిన అవార్డుగా భావించడం లేదని, తెలంగాణకు లభించిన గుర్తింపుగా స్వీకరిస్తున్నానని సీఎం కేసీఆర్ టైమ్స్ గ్రూప్ కు తెలిపారు. ఈ క్రమంలో ఎన్నికల ముందు కెసిఆర్ కి ఈ అవార్డు రావడం పెద్ద మైలేజ్ విషయం అని చెప్పవచ్చు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.