ప్రత్యేక తెలంగాణా ఉద్యమ కాలంలో రెండుకళ్ళ సిద్ధాంతాన్ని ప్రకటించి, అటు ఇటు కాని రాజకీయం నెఱపిన తెలుగుదేశం పార్టీ, ఆపై ప్రజా ప్రతినిధులను సంతలొని జంతువుల్లా కొనటానికి బ్రీఫ్డ్ మె గా ప్రసిద్ధిగాంచిన వీడొయోకి చిక్కి మొత్తం విశ్వానికే రాజకీయ దుర్మార్గాలు పన్నాగాలు నేర్పిన తెలుగుదేశం నాయకత్వం తన పరువు పార్టీ ప్రతిష్ఠ సర్వం కోల్పోయి హైదరాబాద్ నగరం రాత్రికి రాత్రే వదిలెసి అమరావతికి పారిపోయిన ఉదంతంతో - తెలంగాణాలో ఆ పార్టీ దాదాపు నామ రూపాలు లేకుండా మట్టిగొట్టుకు పోయింది. అయితే:  
telangana TDP Leaders కోసం చిత్ర ఫలితం
ముందస్తు ఎన్నికలు తప్పవనే సంకేతాలు బలంగా వస్తున్న నేపథ్యంలో 'తెలంగాణ తెలుగుదేశం పార్టీ' నాయకులు కూడా తమ పార్టీకి మళ్ళా ప్రాణం పోసి రాజకీయ వ్యూహరచనకు సిద్ధపడ్డారు. వారు బుధవారం హైదరాబాదులో సమావేశమయ్యారు. ఈ నెల 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్ర బాబు నాయుడు హైదరాబాదు రానున్నారని తెలుస్తుంది.
lokesh chandrababu కోసం చిత్ర ఫలితం
ఆయన ఆ రోజు తెలంగాణ టీడీపి నేతలతో సమావేశమవుతున్నారు. తన వ్యూహాన్ని వారికి వివరించి, దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల వ్యూహంపై మాత్రమే కాకుండా పొత్తులపై కూడా చంద్రబాబు స్పష్టత ఇస్తారు.  కాగా, తెలంగాణలో టీడీపి కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారానికి ఏపి మంత్రి, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ తెరదించారు. తెలంగాణలోని 119 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని తెలిపారు. అయితే ఆ తరవాత నాలుక మడతేసి "పొత్తులపై పార్టీ పొలిట్‌బ్యూరో తుది నిర్ణయం తీసుకుంటుంది" అని అన్నారు తెలంగాణలో నాయకులు టీడీపీ ని వీడినా కార్యకర్తలు అలాగే ఉన్నారని వ్యాఖ్యానించారు. 


ఎప్పుడైనా హైదరాబాద్‌ లో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం పెడితే కనీసం ఐదు వేల మంది వస్తున్నారని, తెలుగు దేశం పార్టీ కార్యాలయం ప్రజలతో సరిపోవడం లేదని, ప్రతి గ్రామం లోనూ టిడిపికి బలమైన కార్యకర్తలున్నారని ఆయన అన్నారు. 

lokesh chandrababu కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: