విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు ఉన్నది  ఉన్నట్లు మాట్లాడుతారని పేరు. ఆయన వ్యవహార శైలి కొన్ని సందర్భాలలో సొంత పార్టీకే ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. ఇక లేటెస్ట్ గా ఆయన చేసిన షాకింగ్ కామెంట్స్ ఎవరి గురించి అన్న చర్చ సాగుతోంది.


డబ్బులుంటేనే సీట్లు :


గురుపూజోత్సవం  సందర్భంగా అయ్యన్నపాత్రుడు చేసిన ఈ వ్యాఖ్యలు ఇపుడు వైరల్  అవుతున్నాయి. రాజకీయాలలో డబ్బులే ప్రధానం అయిపోయిందని, ఎవరికి సొమ్ములుంటే వారికే సీట్లు దక్కుతున్నాయని అయ్యన్న ఘాటైన కామెంట్స్ చేశారు. రాజకీయ పార్టీలన్నీ ఇదే తీరున ఉన్నాయంటూ ఆయన చెప్పడం విశేషం.


చేరిన రోజునే బేరం :


ఎవరైనా రాజకీయ పార్టీలో చేరితే వెంటనే పార్టీకి ఎంత డబ్బు ఇస్తావంటూ బేరాలు పెడుతున్నారని అయ్యన్న వాపోయారు. ఈ తీరు వల్ల ధనవంతులే రాజకీయాల్లోకి వస్తున్నారు తప్ప అసలైన ప్రజా సేవకులు కానే కాదని అయ్యన్న కుండ బడ్డలు కొట్టారు. దీని వల్ల రాజకీయాలే భ్రష్టు పట్టిపోతున్నాయని అయ్యన్న అంటున్నారు.


వారికే ఎమ్మెల్యే టిక్కెట్లు :


అవినీతి కేసులలో ఉన్న వారికే ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తున్నాని కూడా సంచలన ఆరోపణలు చెశారు. ఒకపుడు చదువుకున్న వారు నీతిగా ఉండే వారని, వారు సైతం ఓటుకు ఇంత అని అడగడం దారుణమని, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఇది కనిపించిందని అయ్యన్న అన్నారు. మొత్తానికి విషయాన్ని జన‌రలైజ్ చేస్తూ అయ్యన్న మాట్లాడినా సొంత పార్టీ వైపు కూడా వేలు చూపించారన్న టాక్ నడుస్తోంది. ఈ మధ్యన కాంగ్రెస్ తొ పొత్తు విషయమై హాట్ కామెంట్స్ చేసిన అయ్యన్న మళ్ళీ ఇలా మాట్లాడడంతో ఎవరిని ఉద్దేశించి అన్నారన్నది చర్చగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: