తెలుగుదేశం పార్టీకి చాలా అడ్వాంటేజీస్ ఉన్నాయి. అందులో అనుకూల మీడియాది కీలక పాత్ర. బయట ఉన్న పరిస్తితిని ఎప్పటికపుడు అనలైజ్ చేసి తన మీడియా ద్వారా తామనుకున్నవి   వాస్తవాలుగా  తెలియచేయయడం. దాని వల్ల పార్టీ ఇబ్బందుల్లో పడకుండా చూడాలనుకోవడం  ఇది పవిత్రమైన బాధ్యతగా ఎప్పటినుంచో స్వీకరించి చేస్తూ వస్తున్నాయి. ఎంతైనా ఆస్థాన మీడియా కదా. ప్రేమతో చేసే హెల్ప్ ఇది. మరి  లేటేస్ట్ గా కాంగ్రెస్ తో పొత్తులపై    అనుకూల మీడియా టీడీపీకి వార్నింగ్స్ ఇస్తోంది.


పెట్టుకుంటే సున్నామేనా :


తెలంగాణాలో కాంగ్రెస్ తో చేతులు కలిపితే టీడీపీకి సున్నమేనని మెత్త మెత్తని హెచ్చరికలు చేస్తోంది. ఎంత చేసినా తెలంగాణాలో కాంగ్రెస్ రేసులో నిలిచేది లేదు, గెలిచేది లేదు, అనవసరంగా పరువు పోగొట్టుకోవద్దంటూ అనుకూల మీడియా చెప్పకనే చెబుతోంది. కాంగ్రెస్ పొత్తు టీడీపీకి ఎంతో డ్యామేజ్ అని, పైగా రేపటి ఏపీ ఎన్నికల్లో కొత్త చిక్కులు వచ్చి అసలుకే ఎసరు అని మొత్తం సినిమాను చూపించేస్తోంది.


గెలుపు పక్కాట :


తెలంగాణాలో కేసీయార్ కంట్రోల్ లో ఉంటున్న అనుకూల మీడియాకు బాబు అక్కడ కాంగ్రెస్ తో దోస్తీ కట్టడం అసలు ఇష్టం లేదట. దీని వల్ల కేసీయార్ తో తమకు కూడా వైరం వస్తుందని కంగారు పడుతోందట. అందువల్ల బాబునే సుతి మెత్తగా హెచ్చరిస్తూ పోటీ చేస్తే సొంతంగా చేసుకుపొమ్మంటోంది, అంతే తప్ప కాంగ్రెస్ తో జత కట్టవద్దని వార్నింగులు ఇస్తోంది. ఎందుచేతనంటే కేసీయర్ గెలుపు అక్కడ పక్కాట. అలా గెలుపు ధీమా మీద ఉన్న పార్టీ మీదకు అనవసరంగా పోయి కెలుక్కుంటే ఇబ్బందులు వస్తాయని  కూడా  చెబుతోంది. మరి. చూడాలి. ఈ మాటలు ఎంత వరకు టీడీపీ ని ప్రభావితం చేస్తాయో.



మరింత సమాచారం తెలుసుకోండి: