ఇటీవల హైదరాబాద్ లోని పురానాహవేలీలో ఉన్న నిజాం మ్యూజియంలో సినీ ఫక్కీలో ఇద్దరు దొంగలు  వజ్రాలు పొదిగి ఉన్న బంగారు టిఫిన్ బాక్సుతో పాటు మరికొన్ని విలువైన బంగారు వస్తువులు  దొంగిలించిన విషయం తెలిసిందే.  దీనిపై అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు. అత్యంత విలువైన బంగారు టిఫిన్ బాక్స్, టీ కప్పు, సాసర్, బంగారు చెంచాను ఎత్తుకెళ్లిన ఇద్దరు దొంగలు టాస్క్ ఫోర్సు పోలీసులకి పట్టుబడ్డారు. 

పట్టుబడిన ఇద్దరు హైదరాబాద్‌కు చెందిన యువకులే అని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అలాగే వారిని ఇప్పుడు రహస్యంగా హైదరబాద్ కు తరలించారు.   వీరిరువురూ ముంబైలోని ఓ రహస్య ప్రాంతంలో ఉండగా హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు.
Image result for టిఫిన్ బాక్సుతో దొంగలు
కాగా, మ్యూజియం నుంచి విలువైన వస్తువులు దొంగిలించిన తర్వాత దొంగలిద్దరూ ముంబై వెళ్లారు. అక్కడ ఓ హోటళ్లో బస చేశారు. కోట్ల విలువైన టిఫిన్ బాక్స్ ను ఓ దొంగ ప్రతి రోజు తిండి తినడానికి ఉపయోగించాడు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. మొత్తానికి చోరీకి గురైన వస్తువులన్నింటినీ రికవరీ చేసినట్టు తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: