చంద్ర బాబు బీజేపీ విడిపోయి బద్ద శత్రువులుగా మారిపోయినారు. అయితే ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో వింతలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో విష్ణుకుమార్‌రాజు చంద్రబాబు అండ్‌ టీమ్‌పై 'స్వామి భక్తి' ప్రదర్శించేశారు. ఈ స్వామి భక్తి అనేది బీజేపీ అధిష్టానంపై వుంటే, దాన్ని తప్పుపట్టాల్సిన పనిలేదు. కానీ, అంతకు మించిన 'భక్తి' చంద్రబాబు మీద విష్ణుకుమార్‌రాజు ప్రదర్శించడమే ఆశ్చర్యకరం.

Image result for chandra  babu

అప్పుడప్పుడూ అధికార పార్టీని నిలదీస్తున్నట్లు కన్పిస్తూనే, కీలకమైన విషయాల్లో చంద్రబాబుని ప్రశ్నించాల్సింది పోయి.. ఆయన్ని భుజాన మోస్తుంటారు విష్ణుకుమార్‌రాజు. అమరావతి బాండ్ల విషయంలో బీజేపీ నానాయాగీ చేసిన, చేస్తోన్న విషయం విదితమే. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు దగ్గర్నుంచి, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ వరకు... ఒకరేంటి.? పైస్థాయి, కిందిస్థాయి అన్న తేడాలేకుండా బీజేపీ నేతలంతా, అమరావతి బాండ్ల వ్యవహారంపై చంద్రబాబు సర్కార్‌ని కడిగిపారేస్తూ వచ్చారు.

Image result for chandra  babu and vishnukumar raj

విషయమై విష్ణుకుమార్‌రాజు కూడా అసెంబ్లీలో అధికార పార్టీని ప్రశ్నించారు. అధికార పార్టీ నుంచి సమాధానం రాగానే, 'భేషుగ్గా వుంది..' అంటూ ప్రశంసించేశారు. 'ఇలాగే అన్ని విషయాల్లోనూ స్పష్టతనివ్వండి..' అంటూ విష్ణుకుమార్‌రాజు, చంద్రబాబు సర్కార్‌కి ఇచ్చిన ఉచిత సలహా తీరు.. చాలామంది బీజేపీ నేతలకే షాక్‌ ఇచ్చిందంటే అది అతిశయోక్తి కాదేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: