ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణలో నేతల మధ్య మాటల తూటాలు తారస్థాయికి చేరుతున్నాయి. మరోపక్క ఒక పార్టీకి చెందిన నాయకులు మరొక పార్టీ లోకి వెళతాడు రెడీ అయిపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ లోకి కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతలు వలసలు కడుతున్నారు.

Related image

తాజాగా ఇటీవల మాజీ స్పీకర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన సురేష్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ నాయకుడైన కెసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరియు అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేరెళ్ల ఆంజనేయులు, ఉప్పల్‌కు చెందిన బండారు లక్ష్మారెడ్డితో పాటు పలువురు నేతలు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.

Related image

ఇదే క్రమంలో మహాకూటమికి అడుగులు వేస్తున్న కాంగ్రెస్ పార్టీలోకి కూడా నేతలు చేరడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో పిసిసి ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఇతర పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

Image result for suresh reddy speaker

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అనిరుధ్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తీర్థం తీసుకున్నారు. మొత్తంమీద చూసుకుంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది అనటంలో ఎటువంటి సందేహం లేదు.




మరింత సమాచారం తెలుసుకోండి: