ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఆశావాహులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదే క్రమంలో జంపు జిలానిలు..అసంతృప్తి నేతలు పార్టీలు మారుతూ తెలంగాణ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నరు.

Image result for jayasudha congress

తాజాగా ఇటీవల నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కేసీఆర్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు...ఈ సంగతి మనకందరికీ తెలిసినదే. ఇదిలావుండగా తాజాగా సీనియర్ హీరోయిన్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు...సికింద్రాబాద్ మాజీ శాసన సభ్యురాలు జ‌య‌సుధ గులాబీ పార్టీలో చేరుతున్నార‌నే వార్త‌లు బ‌లంటా వినిపిస్తున్నాయి.

Image result for jayasudha congress

ఆమెను టీఆర్ఎస్ లో చేరాల్సిందిగా పార్టీ అధినేతలే స్వయంగా ఆహ్వానించారు.రాష్ట్ర మంత్రి కె తారకరామారావు ఇటీవల ఆమెకు స్వయంగా ఫోన్ చేసి తమ పార్టీలో చేరాలని ఆహ్వానించినట్లు సమాచారం.

Image result for jayasudha ktr

కేటీఆర్ ఆహ్వానంపై ఆలోచించి చెబుతానని జయసుధ చెప్పారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న జయసుధ, క్రియాశీలక రాజకీయాలకు గ‌త కొంత కాలంగా దూరంగా ఉన్నారు. అయితే కేటీఆర్ ఫోన్ కాల్ తో పునరాలోచనలో పడ్డారు జయసుధ. మరో పక్క జగన్ పార్టీలోకి వస్తే పార్టీ కచ్చితంగా బలపడుతుందని పేర్కొంటున్నారు టిఆర్ఎస్ నాయకులు.




మరింత సమాచారం తెలుసుకోండి: