శివాజీ ఇప్పడూ ఈ పేరు సినిమాల్లో కంటే రాజకీయాల్లో తెగ మారు మ్రోగి పోతుంది. ఆపరేషన్ గరుడ అంటూ మళ్ళీ వార్తల్లోకి ఎక్కాడు. ‘ఆపరేషన్ గరుడ’లో చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్ జారీ కావడం ప్రారంభం మాత్రమేనని చెప్పారు. ఇది ముందు ముందు కూడా కొనసాగుతుందని హెచ్చరించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ఉచ్చు వేశారని...దయచేసి ఆ ఉచ్చులో పడకండని ఆయనకు హితవు పలికారు.
‘ఆపరేషన్ గరుడ’లో భాగంగా చంద్రబాబును ఇబ్బంది పెట్టే ప్రయత్నాలను కేంద్రం షురూ చేసిందని శివాజీ రెండ్రోజుల క్రితం చెప్పారు. ఆయన సంకేతాలిచ్చినట్లే చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్ జారీ కావడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అక్రమ కేసులతో చంద్రబాబును బలిచేయాలని చూస్తున్నారని ఆరోపించిన శివాజీ...మరో బాంబు కూడా పేల్చారు. చంద్రబాబుకు మరో రెండు నోటీసులు కూడా సిద్దంగా ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.
త్వరలోనే ఈ నోటీసులు చంద్రబాబుకు అందుతాయని చెప్పారు. శివాజీ పనీపాటా లేకుండా తిరుగుతున్నాడని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తనపై కామెంట్స్ చేశారని, జగన్కు ఏమన్నా పని ఉందా? అని శివాజీ మండిపడ్డారు. తన గురించి కొందరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, అయినా ఫర్వాలేదన్నారు.