తన స్వార్ధ రాజకీయాలకోసం ఏపీకి రావలసిన ప్రత్యేక హోదా విషయంలో నిర్లక్ష్యం వహించిన ఏపీ సీఎం టిడిపి అధినేత చంద్రబాబు...రానున్న ఎన్నికల్లో గెలవడం కోసం రెండు రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్. ప్రపంచంలో చంద్రబాబు అంత అవినీతిపరుడు మరొకరు ఉండరని మండిపడ్డారు.

Image result for mp balka suman

ఈ క్రమంలో ఆంధ్రరాష్ట్రానికి చెందిన ఇంటిలిజెన్స్ ఉన్నతాధికారులు...పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో క్యాంప్ ఏర్పాటు చేసుకోవడం పై విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తూ అనుకుంటున్న టిడిపి కుట్రలపై గవర్నర్ స్పందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు బాల్క సుమన్.

Image result for mp balka suman chandrababu

ఇటువంటి విషయాలలో గవర్నర్ స్పందించకపోతే టిఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ ప్రజలు వెంటపడి తరిమేలా ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు.ఏబీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏపీ ఇంటెలిజెన్స్‌ నడుస్తోందని, దీనిపై గవర్నర్‌, డీజీపీలకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఆంధ్ర పోలీసులు తెలంగాణ లో వేలు పెట్టడం ఇది విడ్డూరం అన్నారు.

Image result for mp balka suman chandrababu

చంద్రబాబు చేసిన ఆక్రమాలకు నాలుగైదు సార్లు జీవిత ఖైదు శిక్ష వేసినా సరిపోదన్నారు. ఎన్టీఆర్‌ కుటుంబం చంద్రబాబును టీడీపీ నుంచి తరిమేయాలన్నారు. ఏదైనా జరగరాని సంఘటన జరిగితే దానికి బాధ్యత చంద్రబాబుదే అని బాల్క సుమన్ హెచ్చరించారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు టిడిపి పార్టీ చేసే కుట్రలో పడకూడదని పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: