ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత ఇటీవల ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా విశాఖ నగరంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో భూములు కబ్జా చేశారని కొంచెం కామెంట్లు చేశారు జగన్. ఈ సందర్భంగా వైసీపీ అధినేత చేసిన కామెంట్లపై మండిపడ్డారు గంటా శ్రీనివాసరావు. జగన్ కావాలనే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.
భూకుంభకోణంలో వైఎస్ జగన్ బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు..ఈ చర్చలో నేను భూకుంభకోణం చేయలేదని నిరూపించుకుంటే మీరు నేను చెప్పిన దానికి చేయడానికి దేనికైనా సిద్ధంగా ఉండాలని ఛాలెంజ్ చేశారు.
అవినీతి కేసుల్లో చిక్కున్న జగన్ కి అందరూ అవినీతిపరులుగా కనబడతారు అని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకనే వారు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.
వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరియు చంద్రబాబు నాయుడు గార్లు నిర్విరామంగా పాదయాత్రలు చేసి సీఎం అయ్యారని ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్లి పాద యాత్ర చేసే వ్యక్తి కేవలం జగనే అని ఇదంతా చాలా వింతగా ఉంది అని ఎద్దేవా చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ని ఆపలేరని... అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ని కూడా అడ్డుకోలేరని మండిపడ్డారు.