మహేష్ మీద కమెడియన్ నోరు పారేసుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడినట్లు తెలిసిందే. అయితే ఈ విషయం మీద మా ఇప్పటికే ఒక లేఖ కూడా రాసింది. సదరు మనోజ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, నడిగర్ సంఘానికి లేఖ కూడా రాసింది. దీనిపై నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ విశాల్ స్పందించాడు. ప్రతి విషయాన్ని ప్రేక్షకులు సీరియస్ గా తీసుకోనక్కర్లేదు. మహేష్ అంటే ఏంటో మనందరికీ తెలుసు. ఆయన కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది కూడా ఏమీలేదు. ఆయన చాలా ఫేమస్. మహేష్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరనే విషయం తెలుగు ప్రజలందరికీ తెలుసు." 

Image result for vishal

ఇలా మహేష్ ను వెనకేసుకొచ్చాడు విశాల్. ఎవరో ఏదో అన్నారని అభిమానులు ఆందోళన చెందవద్దని, నిజానికి అంతా కమెడియన్ అంటున్న సదరు మనోజ్ ఎవరో కూడా తనకు తెలియదని వివరణ ఇచ్చాడు విశాల్. నాకు క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ మాత్రమే తెలుసు. ఓ పెద్ద సెలబ్రిటీని విమర్శిస్తే ఆటోమేటిగ్గా ప్రచారం వస్తుందని కొంతమంది భావిస్తుంటారు. ఇది చాలా కామన్. ప్రస్తుతం సోషల్ మీడియా ఇలానే పనిచేస్తోంది. అందుకే ఈ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోవద్దని ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను."

అసలు ఈ మనోజ్ ఎవరు?.. 'మా' లేఖపై విశాల్

మహేష్ అభిమానులంతా అతడిపై మరింత ప్రేమ కురిపించాలని, విమర్శలు చేసిన మనోజ్ ను పట్టించుకోవద్దని కోరుతున్నాడు. విశాల్ చెప్పిన లాజిక్ లో, అతడి వివరణలో అర్థం ఉంది. కానీ మహేష్ అభిమానులు మాత్రం శాంతించలేదు. మనోజ్ ప్రభాకర్ ను ఓ నీచుడిగా అభివర్ణిస్తూనే, అతడిపై ఏదో ఒక రూపంలో చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియాలో విశాల్ ను డిమాండ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: