తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ సృష్టించిన పరువు హత్య ఇప్పుడు ఎన్నో మలుపులు తిరుగుతుంది.  తమకన్నా తక్కువ కులం యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందని ఓ దురహంకారి చేసిన దారుణానికి నిండు ప్రాణం బలైంది.  ప్రణయ్, అమృత వర్షిణి హై స్కూల్ ఏజ్ నుంచి ప్రేమించుకున్నారు..ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో వీరి ప్రేమ మరింత బలపడింది. పెద్దలను ఒప్పించాలని చూసినా లాభం లేదని గ్రహించి ఆర్యసమాజ్ మందిర్ లో వివాహం చేసుకున్నారు.  అప్పటి నుంచి అమృత తండ్రి మారుతిరావు..ప్రణయ్ పై కక్ష్య కట్టాడు.  


తన కూతురుని మాయమాటలు చెప్పి తమకు దూరం చేశాడని..మా అమ్మాయిని వదిలిపెడితే..డబ్బు ఇస్తానని..లేదంటే చంపేస్తానని ఎన్నో రకాలుగా ట్రిక్స్ ప్లే చేశాడు..కానీ ప్రణయ్, అమృతలు మాత్రం తాము పెళ్లి చేసుకున్నామని.. చచ్చినా.. బతికినా కలిసే ఉంటామని అంటూ వస్తున్నారు.  ఈ నేపథ్యంలో ప్రణయ్ పై కక్ష్యపెంచుకుంటూ వస్తున్నాడు మారుతిరావు.  తాజాగా అమృత వర్షిణి తండ్రి మారుతీరావుతో పాటు తల్లి కూడా కలసి కుట్ర చేసి, తన బిడ్డను చంపించారని గత శుక్రవారం పరువుహత్యకు గురైన ప్రణయ్ తల్లి ప్రేమలత సంచలన ఆరోపణలు చేశారు.


హత్య జరిగే రెండు వారాల ముందు అమృత తల్లి ఎంతో మంచిగా నటిస్తూ..మాట్లాడిందని ఎక్కడ ఉంటుంన్నారని వారి గురించి ఆరా తీశారని ఆరోపించారు.  నల్లపూసల గొలుసు చేయించానని, కొత్త బట్టలు పంపుతానని చెబుతూ, వారు ఎక్కడికి వెళుతున్నారన్న వివరాలను సేకరించి తన భర్తకు తెలియజేస్తూ వచ్చిందని..ఆ నేపథ్యంలోనే ఆసుపత్రికి వెళ్తున్నామని తెలుసుకున్న అమృత తల్లిదండ్రులు తన కొడుకును అతి దారుణంగా చంపించారని ఆరోపించింది.  వర్షిణి అంగీకరిస్తే ఆమెను తీసుకువెళ్లచ్చని తాము మారుతీరావుకు స్పష్టంగా చెప్పామని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: