ఈ మద్య మిర్యాలగూడంలో జరిగిన ప్రణయ్ పరువు హత్య విషయం ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేసిందో అదరికీ తెలిసిందే. దాంతో ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు భయాందోళనకు గురి అవుతున్నారు. కులాంతర వివాహం చేసుకున్నంత మాత్రాన ప్రాణాలు తీస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు.
మిర్యాలగూడలో దారుణం మరువక ముందే.. తాజాగా హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ లో దారుణం జరిగింది. ప్రేమజంటపై యువతి మేన మామ దాడి చేశారు. ఈ దాడిలో యువతి పరిస్థితి విషయంగా ఉండలంతో ఆసుపత్రికి తరలించారు.
బోరబండకు చెందిన మాధవి, ఎర్రగడ్డ కు చెందిన నవదీప్ నెల రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. మొదటి నుంచి ఈ వివాహాన్ని వ్యతిరేకిస్తున్న యువతి కుటుంబ సభ్యులు ఈ రోజు వారిని హత్య చేయడానికి పూనుకున్నారు. కాగా, ఈ దంపతులను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.