చంద్ర బాబు మాటలు వింటుంటే ఎవరికైనా ఆశ్చర్యం రాక తప్పదు. తన గురించి గొప్పలు చెప్పుకోవడం లో బాబు తరవాతే ఎవరైనా అన్నంతగా ఎదిగి పోయాడు. నేనే ఫస్ట్.. నేనే ఫస్ట్అని చెప్పుకోవడంలో బాబుకు అదో రకమైన తుత్తి. ఇప్పుడీ తుత్తి కొత్త పుంతలు తొక్కింది. రాష్ట్రం, దేశం దాటి విదేశాలకు కూడా విస్తరించింది. తనను చూస్తే ఏకంగా బ్రిటిష్ ప్రభుత్వమే భయపడుతోందనేది చంద్రబాబు లేటెస్ట్ స్టేట్ మెంట్. 

Image result for chandra babu

ఇదేదో మహానాడులోనో, పార్టీ మీటింగ్ లోనో చెప్పుకుంటే సొంత డబ్బా అనుకోవచ్చు. ఏకంగా అసెంబ్లీలో బాబు ఈ మాట అనేశారు. ఎలాగూ వ్యతిరేకించడానికి ప్రతిపక్షం లేదు. బాబు ఏం మాట్లాడినా బల్లలు కొట్టి హర్షం వ్యక్తంచేసే టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంత బల్ల చరిచినా ఎవరికీ వినిపించని పరిస్థితిలో బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారక్కడ. దీంతో బాబు నోటికి అడ్డుఅదుపు లేకుండా పోయింది. అందుక ఏకంగా కోహినూర్ వజ్రం గురించి కూడా మాట్లాడేశారు.

Image result for chandra babu

"బ్రిటిషర్ల మ్యూజియంకు పోతే వాళ్లు భయపడుతున్నారు. కోహినూర్ వజ్రాన్ని నేను అడుగుతానని వాళ్లు చాలా భయపడ్డారు. అమరావతికి సంబంధించినవి కూడా చాలాపెట్టారు. నేను చూడ్డానికి పోతానంటే భయపడి, నన్ను అడ్డుకునే పరిస్థితికి వచ్చారు." అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు చెబుతున్న మాటలివి. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేశానని, సత్య నాదెళ్లను మైక్రోసాఫ్ట్ సీఈవోను చేశానని, హైదరాబాద్ ను ప్రపంచపటంలో నిలిపానని.. ఇలా ఎన్నో చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు కోహినూర్ వజ్రాన్ని కూడా తనే అడిగానని చెప్పుకున్నారు. చంద్ర బాబు ను చూసి బ్రిటిష్ పాలకులు వణుకుతున్నారంటూ అసెంబ్లీలో చెప్పుకున్నారు. ఇది మాత్రమే కాదు, అసెంబ్లీ సాక్షిగా బాబు చెబుతున్న అబద్ధాలు ఇప్పుడు పరాకాష్టకు చేరాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: