విశాఖపట్నం జిల్లాలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మావోయిస్టుల చేతిలో చనిపోయిన వార్త రెండు తెలుగు రాష్ట్రాలలో కలకలం సృష్టించింది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారిగా మావోయిస్టులు రాజకీయ నాయకుడి పై దాడి చేయడంతో ఏపీ లో ఉన్న అన్ని పార్టీల నాయకులు బెదిరిపోయారు.

Image result for kidari sarveswara rao

ఈ ఘటనలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తో పాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను తుపాకులతో రౌండప్‌ చేసి దూరంగా తీసుకెళ్లి మావోయిస్టుల కాల్చి చంపారని సివేరి సోము కారు డ్రైవర్‌ చిట్టిబాబు మీడియాకు వెల్లడించారు. గ్రామసభకు వెళ్తున్న తమ కాన్వాయ్‌ని మావోయిస్టులు మార్గం మధ్యలో అడ్డగించినట్టు తెలిపారు. గన్‌మెన్‌ల ఆయుధాలను మావోయిస్టులు లాక్కొని తమని దూరంగా తీసుకెళ్లినట్టు చెప్పారు.

Image result for kidari sarveswara rao

రన్నింగ్ లో ఉన్న కారులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే కిడారి మరియు మాజీ ఎమ్మెల్యే సోమల పై ఒక్కసారిగా కొందరు మావోయిస్టులు దాడి చేసి బయటకు లాగి ...చేతులను వెనక్కి కట్టేసి దూరంగా తీసుకెళ్లినట్టు తెలిపారు.

Image result for kidari sarveswara rao

ఈ క్రమంలో మావోయిస్టులు పారిపోతే నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేస్తామని బెదిరించారని డ్రైవర్ చిట్టి బాబు తెలిపారు. కిడారి, సోమలపై కాల్పుల శబ్దం వినబడ్డాక తమను వదిలేసారని చిట్టిబాబు వెల్లడించారు. చివరిగా మావోయిస్టులు వెళ్తూ వారెన్ని అక్రమాలు చేశారో తెలుసా? అని తమను ప్రశ్నించారని.. ఇటువంటివారు ప్రజల మధ్య బ్రతకకూడదు అని మావోయిస్టుల అన్నట్లు చిట్టిబాబు తెలిపారు.




మరింత సమాచారం తెలుసుకోండి: