ప్రభుత్వాధినేత, సీఎం చంద్రబాబుపై తాజాగా జగన్ చేస్తున్న కామెంట్లపై అటు వైసీపీ నేతలే కాకుండా ఇటు నెటిజన్లు కూడా జోష్గా ఫీలవుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబును తీవ్రస్థాయిలో ఇరుకున పెట్టేవేనని అంటున్నారు. విషయంలోకి వెళ్తే.. ప్రజాసంకల్ప యాత్ర నిర్వహిస్తున్న వైసీపీ అధినేత జగన్.. విశాఖలో తన పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పాదయాత్ర 3000 కిలో మీటర్ల మైలురాయిని దాటింది. అయితే, వచ్చే ఎన్నికలకు సంబంధించి మంచి ఊపుమీదున్న జగన్.. చంద్రబాబుపై పదునైన విమర్శలు చేశారు. చేతికి గడియారం, వేలికి ఉంగరం, మెడలో గొలుసు లేని నిరుపేదనని సీఎం చంద్రబాబు చెబుతుంటారని, అయితే కోట్లు కుమ్మరించి వైసీపీ నేతలను మాత్రం కొంటుంటారని దుయ్యబట్టారు.
23మంది వైసీపీ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరినీ రూ.20 నుంచి రూ.30 కోట్లు ఇచ్చి ఎలా కొనుగోలు చేశారని ప్రశ్నించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన ఆయన కొత్తవలస బహిరంగ సభలో మాట్లాడారు. అమెరి కా నుంచి ఆహ్వానం వచ్చిందని, ఐక్యరాజ్యసమితిలో రైతుల గురించి మాట్లాడతానని చంద్రబాబు చెబుతున్నారని, నిజంగా ఆయనకు రైతుల గురించి మాట్లాడే హక్కు ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతు రుణ మాఫీ ఇప్పటి వరకు కూడా పూర్తిగా సాగిందిలేదు. అయితే, చంద్రబాబు మాత్రం రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉందని, అందుకే చేయలేకపోతున్నా మని అంటున్నారు. కానీ, ఎన్నికల సమయానికే చంద్రబాబుకు ఈ విషయం తెలుసుకదా? అనేది మేధావుల మాట. కానీ, ఆయన మాత్రం ఈ విషయంలో మౌనంగా ఉంటారు.
ఇక, దేశంలో అత్యంత సన్నుల సీఎంల జాబితాలో చంద్రబాబు పేరు ముందుండడం కూడా ఇక్కడ గమనార్హం. ఇక, తాజాగా వెలువరించిన అత్యంత సంపన్నుల జాబితాలో దాదాపు 1200 కోట్ల ఆస్తులతో సీఎం సతీమని భువనేశ్వరి ఏపీలోని మహిళా పారిశ్రామిక వేత్తల వరుసలో ఉండడం గమనార్హం. కానీ, చంద్రబాబు మాత్రం ఎక్కడ ఏ వేదిక ఎక్కినా ఆయన మాత్రం తాను పాలు కూరగాయల వ్యాపారం చేసుకుని పొట్టపోసుకుంటున్నానని కథలు చెబుతున్నారు. ఇక, ఆయన కుమారుడు, మంత్రి వర్యులు లోకేష్ కూడాఎక్కడ ఏ మైకు దొరికినా.. ఆయన కూడా పెద్ద ఎత్తున ఆయన కూడా తన తల్లి తనను పాలు, కూరగాయలు అమ్మి పోషిస్తోందని చెబుతున్నారు. కానీ, దేశంలోనే అత్యంత సంపన్న సీఎం మాత్రం చంద్రబాబు. ప్రపంచంలోని మహిళా పారిశ్రామిక వేత్తలో 1200 కోట్ల రొటేషన్తో ఆయన సతీమణి భువనేశ్వరి చోటు దక్కించుకుంటున్నారు. ఇదీ పరిస్థితి!!