ప్రమాదాలు ఎక్కడ నుంచి పొంచి ఉంటాయో తెలియదు. కొన్ని అనుకోకుండా జరిగే ప్రమాదాలు తేరుకునే లోపు అనర్థం జరిగిపోతుంటాయి. ఇక ప్రకృతి బీభత్సం వల్ల ఎన్నో ప్రమాదాలు జరిగిన ఘటనలు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా బల్లికురవలో గ్రానైట్ పాలిషింగ్ యూనిట్ కూలి మహిళ మృతిచెందింది. అయితే ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
అక్కడ రేకుల షెడ్డు కూలి కారు, ఐదు బైకులు ధ్వంసం అయ్యాయి. అంతే కాదు రేకుల షెడ్ కింద మరికొంత మంది ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి కారణం కొన్ని రోజులు నుంచి విపరీతంగా వర్షాలు కూరియడం..గాలివానకు నిర్మాణంలో ఉన్న గ్రానైట్ పాలిషింగ్ యూనిట్ కుప్పకూలింది.