అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడుకు ఎన్ఆర్ఐలు పెద్ద షాకే ఇచ్చారు. వారు షాకిస్తారని ఏమాత్రం ఊహించని చంద్రబాబు ఏం చేయాలో తెలీక బిత్తరపోయారు. ఇంతకీ విషయం ఏమిటంటే, అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు ఎన్ఆర్ఐల కోసం ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే న్యూజెర్సీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.
కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు లేవగానే సభికుల నుండి ఒక్కసారిగా అరుపులు, కేకలు మొదలయ్యాయి. చంద్రబాబు మాట్లాడేందుకు లేదంటూ ఒక్కసారిగా అరుపులు మొదలుపెట్టారు. దాంతో చంద్రబాబు బిత్తరపోయారు. ఇంతకీ విషయం ఏమిటంటే, చంద్రబాబుతో వేదిక మీద కూర్చున్న వారి విషయంలోనే సభలో పాల్గొన్నవారు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఈమధ్యే షికాగో వేదికగా సినీతారల సెక్స్ రాకెట్ బయటపడిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సెక్స్ రాకెట్ నిర్వహణలో కానీ భాగస్వామ్యంలో కానీ బాధ్యులు, కీలక వ్యక్తులను పోలీసులు పలుమార్లు విచారించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. సెక్స్ రాకెట్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, అదే కేసులో పోలీసు విచారణను ఎదుర్కొంటున్న వారంతా చంద్రబాబుతో కలిసి వేదికపైన కూర్చోవటాన్ని అందరూ వ్యతిరేకించారు. మందు వారందరినీ వేదిక మీద నుండి దింపేయాలంటూ నినాదాలిచ్చారు.
నిరసన వ్యక్తం చేస్తున్న వారిని సముదాయించాలని చంద్రబాబు ప్రయత్నించినా ఎవరూ వినలేదు. దాంతో నిర్వాహకులే కేకలు వేస్తున్న వారిని సముదాయించేందుకు అవస్తలు పడ్డారు. తర్వాత చంద్రబాబు మాట్లాడేందుకు సిద్ధపడ్డా తగిలిన షాక్ తో రెండు నిముషాలు మాట్లాడి కూర్చునేశారు. వేదిక మీదే కాదు చంద్రబాబు అమెరికా పర్యటనకు వచ్చిన దగ్గర నుండి మొత్తం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే కీలకంగా వ్యవహరిస్తున్నారంటూ పలువురు ఎన్ఆర్ఐలు మండిపోతున్నారు.