వివాహితుడైన వ్యక్తి, వివాహిత అయిన ఇతర మహిళ ఇష్టంతో శారీరక సంబంధం పెట్టుకోవడం శిక్షార్హమైన నేరం కాదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. వివాహం రద్దు చేసుకోవడానికి మాత్రం దీన్ని కారణంగా చూపించవచ్చని పేర్కొంది.  ఇండియన్ పీనల్ కోడ్‌లోని అడల్టరీకి సంబంధించిన సెక్షన్ 497 రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం తెలిపింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, ఏఎం ఖాన్‌విల్కర్, డీవై చంద్రచూడ్, ఇందు మల్హోత్రాలతో కూడిన బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. 



ఇప్పటి వరకూ ఉన్న చట్టం ప్రకారం వివాహితుడు తన భార్యతో కాకుండా మరో వివాహిత తో వివాహేతర సంబంధం పెట్టు కోవడం నేరం. తన భర్త కు మరో మహిళతో సంబంధం ఉందని భార్య కేసు పెడితే అతణ్ని ఐదేళ్లపాటు జైలుకు పంపొచ్చు. స్త్రీ పురుషులిద్దరూ ఇలాంటి చర్యకు పాల్పడితే, సెక్షన్ 497 ప్రకారం కేవలం పురుషుణ్ని మాత్రమే శిక్షించే వీలుంది. దీన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. వివాహేతర సంబంధం లో ఇద్దరికీ సమాన పాత్ర ఉన్నప్పుడు సెక్షన్ 497 చట్టబద్ధం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒక వివాహితుడు వితంతువుతో లేదా పెళ్లికాని అమ్మాయితో శారీరక సంబంధం పెట్టుకోవడం అడల్టరీ కిందకు రాదు. 
Image result for extramarital affairs now not crime in india

సుప్రీం కోర్టు తీర్పు లోని ముఖ్యాంశాలు: 

*అడల్టరీ అనేది శిక్షార్హమైన నేరం కాదు, కానీ ఆ కారణంతో విడాకులు తీసుకోవచ్చని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా తెలిపారు.
*వివాహేతర సంబంధం కారణంగా భాగస్వామి ఆత్మహత్యకు పాల్పడితే, సాక్ష్యం చూపించగలిగితే, ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణంగా కేసు నమోదు చేయొచ్చు.
*వివాహ వ్యవస్థను ముగింపు పలికే తప్పుడు చర్యగా అడల్టరీని బెంచ్ అభివర్ణించింది.
*మహిళల పట్ల అసమానత్వం తో వ్యవహరించడం రాజ్యాంగ రీత్యా సరైన చర్య కాదని సుప్రీం కోర్టు పేర్కొంది.
*భార్య భర్త లిద్దరూ సమానమేనన్న ధర్మాసనం, భార్యపై భర్త సర్వాధికారి కాదని స్పష్టం చేసింది.

Image result for supreme court and extramarital affairs

* ఐపీసీ లోని సెక్షన్ 497 ఏకపక్షమని చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు. 
* అడల్టరీ వల్ల దాంపత్యం అసంతృప్తికి కారణం కావడం కాదు. అసంతృప్తి కూడిన దాంపత్యమే ఈ పరిస్థితికి దారి తీస్తుందని     జస్టిస్ మిశ్రా తెలిపారు. 
* చీఫ్ జస్టిస్ మిశ్రా, జస్టిస్ ఖన్విల్కర్ సెక్షన్ 497 ను కాలం చెల్లిన నిబంధనగా పేర్కొన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. *భార్యను భర్త తన ఆస్తిగా భావిస్తూ, మహిళల ఆత్మ గౌరవానికి విఘాతం కలిగించడానికి సెక్షన్ 497 కారణమవుతోందని జస్టిస్      డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. 


సెక్షన్‌ 497ప్రకారం, పెళ్లయిన స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకున్న పురుషుడికి ఏడాది నుంచి ఐదేళ్ల వరకు జైలుశిక్ష, జరి మానా లేక ఈ రెండూ గానీ ఉంటాయి. స్త్రీకు ఇవేమీ ఉండవు. ఆమె అసలు నేరస్తురాలే కాబోదు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 ప్రకారం మతానికి, జాతికి, కులానికి, ప్రాంతానికి అతీతంగా స్త్రీ, పురుషులంతా చట్టం ముందు సమానమే అయిన ప్పుడు 497 సెక్షన్‌ కూడా ఆ ఆర్టికల్‌కు లోబడే ఉండాలని, కాబట్టి ఈ సెక్షన్‌ను చెల్లబోదని పిటిషనర్‌ వాదిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: