ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చింతమనేని ఆకు రౌడీలా వీధి రౌడీలా గాలి రౌడీల ప్రజల పై ప్రవర్తిస్తున్నారంటూ ఇటువంటి వ్యక్తిని చంద్రబాబు వెనకేసుకొస్తున్నారు అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు పవన్.

Image result for chinthamaneni

దీంతో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీడియా దగ్గర స్పందించారు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. వ్యక్తిగతంగాపవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని.. అలాగే ఆయన యాక్టింగ్ అంటే ఇష్టమని  పేర్కొన్నారు చింతమనేని. నాలాంటి తక్కువ స్థాయి వ్యక్తుల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ముఖ్యంగా ప్రపంచాన్ని కదలించిన నాయకులతో పవన్ లాంటి వ్యక్తులు నన్ను పోల్చటం తో నా స్థాయి మరింత పెంచారు అని అన్నారు.

Image result for chinthamaneni jagan

ఇంకా ప్రభాకర్ మీడియా తో మాట్లాడుతూ...నా నియోజకవర్గానికి వచ్చి మాట్లాడి వెళ్లావు.. ఆధారాలు ఉన్నా లేకున్నా ఆరోపణలు చేసి వెళ్లావు.. భారతప్రభుత్వం ప్రతి ఒక్కరికి భావస్వేచ్ఛను ఇచ్చింది.

Image result for chinthamaneni

అందుకే ఊరుకున్నానని ఆయన అన్నారు. తాను ఒక్క మాట చెప్పి ఉంటే.. ఊరు దాటేవాడివి కాదని పవన్‌ను ఉద్దేశించి అన్నారు. 1300 కోట్లతో తన నియోజక వర్గాన్ని అభివృద్ధి చేశానని .. దెందులూరు అంటే అభివృద్ధి అని.. అభివృద్ధి అంటే దెందులూరు అనే విధంగా తన నియోజకవర్గాన్ని తీర్చిదిద్దానన్నారు. దెందులూరులో నన్ను ప్రశ్నించినట్లు.. పులివెందులలో జగన్‌ని ప్రశ్నించగలవా అని పవన్‌ని  ప్రశ్నించారు చింతమనేని ప్రభాకర్.




మరింత సమాచారం తెలుసుకోండి: