ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తెరాస నాయకుల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకొని తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. తాజాగా ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూల్ లో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులపై ధ్వజమెత్తారు.

Image result for ktr

పెళ్లి కానోళ్లకు పిల్లను వెతికిపెడతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెడతారని తనకు ఇప్పుడే వార్త అందిందంటూ సెటైర్లు వేశారు. ఇంకా కేటీఆర్ మాట్లాడుతూ ‘పెళ్లయిన తర్వాత మీ ఇంట్లో మేమే వచ్చి మూడు పూటలా వండిపెడతాం.. ఆ తర్వాత గోరుముద్దలు కూడా మీ పిల్లలకు మేమే తినిపిస్తాం. ఆఖరికి, మీరు బిజీగా ఉంటే మీ పిల్లల డైపర్లు కూడా మేమే మారుస్తామని చెబుతారు’ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలను ఎద్దేవా చేశారు.

Related image

ఇదే క్రమంలో తెలుగుదేశం పార్టీపై కూడా మండిపడ్డారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆనాడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే..ప్రస్తుతం ఆ తెలుగుదేశం పార్టీ ఏ కాంగ్రెస్ పార్టీ ని కాపాడటానికి సిద్ధపడటం దారుణమని అన్నారు.

Image result for ktr

పై నుండి ఇటువంటి దారుణమైన చర్యలు రామారావుగారు చూసి బాధపడుతుంటారని పేర్కొన్నారు కేటీఆర్. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న వారికి ఎన్నికలలో అడ్రస్ లేకుండా ప్రజలు తీర్పు ఇస్తారని అన్నారు కేటీఆర్.




మరింత సమాచారం తెలుసుకోండి: