తెలుగుదేశం పార్టీని వదిలేస్తారనుకున్న ఊహాగానాలకు చెక్ పెడుతూ టీడీపీయే మరో మారు అధికారంలోకి వస్తుందని మంత్రి గంటా శ్రీనివాసరావు  బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. వర్తమాన రాజకీయంలో జెండా మార్చేందుకు వేరే పార్టీ కనిపించకపోవడంతో గంటా టీడీపీకి కి గట్టి మద్దతుదారులా గొంతు సవరించుకుంటున్నారు. దాంతో ఆయన కొత్త సవాళ్ళను కూడా విసురుతున్నారు.


టీడీపీకి ఎదురులేదట :


టీడీపీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో బలంగా ఉందట. ఇది గంటా వారి సర్వే భాష్యం. ఎపుడు ఎన్నికలు వచ్చినా సైకిల్ పార్టీని జనం నెత్తిన పెట్టుకుంటారట. అన్ని హామీలను నెరవేర్చిన ఘనత తమ పార్టీదేనని గంటా అంటున్నారు. తమకు ఏపీలో ఎదురే లేదని గంటా ధీమాగా చెబుతున్నారు.


అది మునిగే నావ :


ప్రతిపక్ష వైసీపీని చెడా మడా తిడుతూ కడిగిపారేసిన గంటా మునినే నావతో ఆ పార్టీని పోల్చారు. విశాఖ జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేస్తే అన్ని పార్టీల నుంచి నాయకులు వచ్చి చేరుతారని డప్పాలు కొట్టారు. ఏమైంది. ఎవరూ చేరలేదు. అదీ ఆ పార్టీ పట్ల నాయకుల్లో, జనంలో ఉన్న అభిప్రాయమంటూ గట్టిగానే ఎండగట్టారు. వైసీపీకి దశ దిశా కూడా లేదని, నాయకుడే అవినీతిపరుడంటూ బాగానే నోరు చేసుకున్నారు.


వైసీపీ నుంచి వలసలు :


ఇక తొందరలో వైసీపీ నుంచె వలసలు మొదలవబోతున్నాయని గంటా చెప్పుకొచ్చారు. చాలా మంది బడా నాయకులు తమతో టచ్ లో ఉన్నారని గంటా బాంబు పేల్చారు. అపుడు వైసీపీ మూసుకోవాల్సిందేనంటూ సెటైర్లు కూడా వేశారు. జగన్ ది పాదయాత్ర కాదు, జస్ట్ వాకింగ్ అంతేనంటూ  గంటా ఎద్దేవా చేశారు. మూడు కాదు ముప్పై కిలోమీటర్లు జగన్ నడచినా జనం ఆయనను నమ్మరని గంటా జోస్యం చెప్పేశారు.
మొత్తానికి గంటా వారిలా చెలరేగిపోవడానికి, టీడీపీ పై కడు విశ్వాసం ప్రకటించడానికి సైకిల్ తప్ప మరో ఆప్షన్ లేకపోవడమేనని సెటైర్లు పడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: