దేశంలో రోజు రోజుకీ క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోతుంది.  ఎక్కడ ఏ ముల నుంచి ఎవరు ఎటాక్ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.  పగలూ..ప్రతికారాలు ఉన్నవారు ఒకరినొకరు దారుణంగా చంపుకుంటున్నారు.  ఈ మద్య మిర్యాలగూడలో ప్రణయ్ హత్య గురించి తెలిసిందే..తన కూతురుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న అక్కసుతో అమృత భర్త అయిన ప్రణయ్ ని ఆమె తండ్రి అత్యంత దారుణంగా నరికి చంపించారు. 

ఈ విషయం మరువక ముందే..ఎర్రగడ్డలో తనను కాదని వేరే కులస్థుడిని పెళ్లి చేసుకుందని కూతురుపై పాశవికంగా దాడి చేసిన తండ్రిని చూశాం..రెండు రోజుల క్రితం తన కొడుకుని చంపాడని నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని అత్యంత దారుణంగా నరికి చంపిన వైనం చూశాం.తాజాగా తన తల్లిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా తల నరికి రోడ్డుపై నడుచుకుంటూ పోలీసులకు లొంగిపోయిన సంఘటన కర్ణాటకలో జరిగింది.  

నింధితుడు పశుపతి తల్లిపై హతుడు గిరీష్ అఘాయిత్యం చేశాడని కసితో అతని తల నరికి తలతో సహ పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు.  కర్ణాటక మాండ్యా జిల్లా మల్లవల్లిలో ఈ ఘటన జరిగింది.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: