తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అక్రమాస్తుల కేసులో కాంగ్రెస్ నాయకుడు కొడంగల్ ఎమ్మెల్యే అయినా రేవంత్ రెడ్డి ని దర్యాప్తు సంస్థలు ఇటీవల అదుపులోకి తీసుకుని విచారిస్తున్న నేపథ్యంలో ఆంధ్రాలో ఉన్న ఎల్లో మీడియా రేవంత్ రెడ్డికి అనుకూలంగా కథనాలు ప్రసారం చేస్తూ...ముఖ్యంగా ప్రజల్లో సానుభూతి వచ్చే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వైసిపి నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు.

Related image

రేవంత్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ, ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టగానే పచ్చ మీడియా ‘రేవంత్ పై పంజా’ ‘భావోద్వేగానికి లోనైన రేవంత్’ అంటూ సానుభూతి కథనాలను వండిందని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో డైరెక్టుగా దొరికిన దొంగను హీరోగా చూపడం వెనుక రహస్యం ఏంటని భూమన ప్రశ్నించారు. సోదాల‌ల్లో బ‌య‌ట‌ప‌డుతున్న సొమ్ము రేవంత్‌దా లేకా చంద్ర‌బాబు నాయుడిదా అని ప్రశ్నించారు.

Image result for revanth reddy chandrababu

ఏపీ, తెలంగాణలో చట్టం, న్యాయం, రాజ్యాంగం అమలుకావడం లేదని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుని ఇప్పటి దాకా ఎందుకు ప్రశ్నించకుండా వదిలేశారని ఎందుకు విచారణ చేయటం లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Related image

ప్రజలు ఎన్నుకొన్న ప్రజాస్వామ్యాన్ని డబ్బులతో కొనుగోలు చేయడంలో చంద్రబాబు కి మించిన వారు లేరని తీవ్రస్థాయిలో మండిపడ్డారు భూమన కరుణాకర్ రెడ్డి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే చంద్రబాబు పాపం పండిందని త్వరలోనే తగిన శాస్తి అనుభవిస్తారని జోష్యం చెప్పారు భూమన కరుణాకర్ రెడ్డి.




మరింత సమాచారం తెలుసుకోండి: