జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో చేస్తున్న ప్రజా పోరాట యాత్ర ఆంధ్ర రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ చేపట్టిన మహాసభ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ నేతలలో తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆకు రౌడీ...వీధి రౌడి...గాలి రౌడీ అంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్ లో తీవ్ర కలకలం సృష్టించాయి.

Image result for pawan kalyan

ఇదే క్రమంలో టి డి పీ కి సంబంధించిన నాయకులు కూడా చింతమనేని ప్రభాకర్ పై పవన్ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరో పక్క పవన్ కళ్యాణ్ బస చేస్తున్న స్థలం దగ్గరకి కూడా కొంతమంది దుండగులు దాడికి పాల్పడడంతో ఈ అంశం ప్రస్తుతం ఆంధ్రా లో చర్చనీయాంశం అయింది. ముఖ్యంగా తనపై దాడికి యత్నించిన వారి గురించి చింతలపూడి సభలో పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో స్పందించారు.

Image result for pawan kalyan lokesh chandrababu

తెలుగుదేశం పార్టీకి వారు చేస్తున్న అవినీతి కార్యక్రమాలను ప్రశ్నిస్తున్న జన సైనికులపై అధికార పార్టీ నాయకులు దాడికి పాల్పడటం ప్రజాస్వామ్యంలోనే దారుణమైన చర్య అని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకులు నన్ను ఉద్దేశించి నిన్న కాక మొన్న వచ్చిన నువ్వెవరు అడగడానికి అంటే అలాంటప్పుడు నా ఇంటికి వచ్చి మరీ ఎందుకు నా మద్దతు కావాలని కోరారని ప్రశ్నించారు.

Related image

నా పుట్టిన రోజుకి చంద్రబాబు నాయుడు గారు వారి అబ్బాయి లోకేష్ గారు శుభాకాంక్షలు తెలిపారు కానీ ఇటీవల నాపై జరిగిన దాడిపై మాత్రం మీ ఇద్దరు ఎందుకు స్పందించడం లేదు అని,దానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని ప్రశ్నించారు. తాజాగా చింతలపూడి లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ లో హాట్ టాపిక్ అయ్యాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: