ఎన్టీఆర్ తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం లో నటిస్తున్నాడని గాసిప్స్ వస్తున్నాయి. మెర్సల్` హిట్ తో అట్లీ పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగింది. విజయ్ కెరీర్ లో తొలిసారి 200 కోట్లు వసూళ్లు సాధించడంతో ఇద్దరికి మంచి పేరొచ్చింది. అందుకే ఇప్పుడు అట్లీతో, ఎన్టీఆర్ రంగంలోకి దిగుతున్నాడని ప్రచారం సాగుతోంది. ఇటీవలే నిర్మాత అశ్వినీ దత్ అట్లీ- ఓ స్టార్ హీరో కాంబినేషన్ లో భారీ డడ్జెట్ సినిమా నిర్మిస్తున్నట్లు ప్రకటించారు.
ఇప్పుడా ఆ హీరో ఎన్టీఆర్ నని దత్ క్లోజ్ సోర్సెస్ ద్వారా లీకైంది. నిజంగా ఈ కాంబోలో సినిమా అంటే అదిరిపోతుంది. అట్లీ కథలు యూనిక్ గా ఉంటాయి. కమర్శియల్ గాను ఉంటాయి. మాస్ ఇమేజ్ ఉన్న హీరోకు అట్లీ కథలు తోడైతే బాక్సాఫీస్ షేకైపోవడం ఖాయం. అందుకే దత్ ఈ విధంగా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఇప్పట్లో తెరకెక్కే అవకాశం లేదు.
ఎందుకంటే అరవింద సమేత వీర రాఘవ రిలీజ్ తర్వాత ఎన్టీఆర్, జక్కన్న మల్టీస్టారర్ షూటింగ్ లో పాల్గొంటాడు. ఇప్పటికే జక్కన్న సర్వం సిద్దం చేసి రెడీగా ఉన్నాడు. సినిమా ప్రారంభించి నెమ్మదిగా రెగ్యులర్ షూట్ కు వెళ్లాలని చూస్తున్నారు. రామ్ చరణ్ షూటింగ్ హాజరు కావడానికి ఇంకా సమయం పడుతుంది కాబట్టి ఈలోపు తారక్, ఇతర నటీనటులపై షూట్ చేయాలని చూస్తున్నారు. అనంతరం ఎన్టీర్- అట్లీ సినిమా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.