విజయనగరం జిల్లా లో ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర ఆంధ్ర రాజకీయాలను హీటెక్కిస్తోంది. ఒకపక్క తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు అంటూ అక్కడ ఎన్నికల వాతావరణం ఇప్పటికే మొదలైపోయింది..అయితే ఆంధ్రాలో మాత్రం ఎన్నికల రాకముందే...ఆ వాతావరణాన్ని తలపిస్తుంది ఆంధ్రాలో.


ఈ క్రమంలో జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర పై అధికార పార్టీ నేతలు ఇష్టమొచ్చినట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో విజయనగరం లో జరుగుతున్న పాదయాత్రలో అక్కడ కరెంటు తీసేసి...జగన్ సభకు ఆటంకం కలిగించారు అధికార పార్టీ నేతలు. ఇదే క్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు జగన్ పాదయాత్ర పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Image result for GANTA PAWAN JAGAN

ప్రస్తుతం ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న జగన్ విశాఖకు రావాల్సిన రైల్వే జోన్ కోసం నరేంద్ర మోడీని ఎందుకు ప్రశ్నించలేదని పేర్కొన్నారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు నరేంద్ర మోడీని ప్రశ్నించడం లేదని విమర్శిస్తున్నారు గంటా శ్రీనివాసరావు. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో రాఫెల్ కుంభకోణం ఎంతటి విధ్వంసం సృష్టించారు అందరికీ తెలుసు...ఈ విషయాలపై జగన్ పవన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తున్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు.


అసలు రాష్ట్రానికి ఎదైనా ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం అని...అటువంటిది కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల ముందు నిలదీయడం సిగ్గుచేటు...స్వార్థ రాజకీయాలకు నిదర్శనమని మంత్రి గంటా అభిప్రాయపడుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: