బాలయ్య మీటింగ్ పెట్టారంటేనే ఓ సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. అది  ఆయన స్పీచ్ లకు కానే కాదు, ఆయన పోకడలతోనే సంచలనాలు నమోదు చేస్తారు. అప్పట్లో నంద్యాల  ఉప ఎన్నికల వేళ ఫాన్స్ మీద చేయి చేసుకున్నాడని ప్రచారం, అంతకు ముందు కూడా చాలాసందర్భాల్లో బాలయ్య ఇదే దూకుడుతో పోతూ వచ్చారు. లేటేస్ట్ ఎపిసోడ్లో ఖమ్మం ఫాన్స్ వంతు.


శుభమా అంటూ :


ఏదో తెలంగాణాలో అందరి సాయంతో ఈసారి ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ మహా కూటమి కట్టింది. అందులో  టీడీపీ కూడా చేరింది. ప్రచారానికి బాలయ్యని పిలిచారు. శుభమా అని బోణీ కొట్టమంటే అభిమానులనే కొట్టారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన బాలయ్య నలుగురు అభిమానులపై చేయిచేసుకున్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి వద్ద బాలకృష్ణ కాన్వాయ్ వస్తుండగా నలుగురు అభిమానులు ఆయనను అడ్డగించి చేతులు కలిపేందుకు ప్రయత్నించారు.
అయితే సహనం కోల్పోయిన బాలకృష్ణ వాహనం దిగి మరీ వారిపై చేయిచేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన బాలయ్య అభిమానులు ఆయన ఫ్లెక్సీని తగులపెట్టారు. 


తీరు మారలేదే :


ఓవైపు బాలయ్య తన తండ్రి అన్న గారి పాత్రతో బయోపిక్ లో నటిస్తున్నారు. అది  ఓ విధంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడమే. మరి. తండ్రి పాత్ర వేస్తున్న బాలయ్యకు ఆయనలోని  సహనం  లాంటి మంచి లక్షణాలు అబ్బాయా అంటే లేదని ఈ తాజా ఘటన రుజువు చేస్తోంది. బాలయ్య వ్యక్తిగతంగా మంచి వారే. అందులో ఎవరికీ డౌట్ లేదు. ఆయన షార్ట్ టెంపరే కొంప ముంచుతోంది. బాలయ్య క్రౌడ్  పుల్లర్ కదా అని తెచ్చి పెట్టుకున్న్న నేరానికి మీటింగ్ రెస్పాన్స్ సంగతేమో కానీ ఇపుడు చేతి దురద పెద్ద రచ్చ అయిపోయిందని మహా కూటమి నేతలు గోడుమంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: