ఆమెది ఘనమైన కుటుంబ చరిత్ర. ఆ ఫ్యామిలీ అంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో మంచి పేరుంది. సంస్థానాధీశులు వారు. ఒకనాడు రాజ్యాలే పాలించారు. అటువంటి కుటుంబం నుంచి అనూహ్యంగా కాషాయం పార్టీలోకి ఆమె వచ్చి చేరారు. రాజకీయంగా అక్కడ నుంచి అడుగులు వేయాలనుకుంటున్నారు. ఇది చాలా ఇంటెరెస్టింగ్ మ్యాటరే సుమా.


ఆనంద్ కూతురుగా: 


ఆమె పూసపాటి వారి కుటుంబానికి చెందిన ఆనందగజపతి రాజు కుమార్తె. విశాఖ మాజీ ఎంపీ ఉమాగజపతిరాజు, ఆనంద్ ల జంటకు పుట్టిన కూతురు. ఆమె పేరు సంచయిత గజపతి రాజు.  ఆమె సామజిక కార్యక‌ర్తగా చాలాకాలాంగా పనిచేస్తున్నారు. . తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల ప్రజలకు రక్షితమైన తాగు నీరు అందించేందుకు అవగాహ‌నా కార్యక్రమాలను ఆమె నిర్వహిస్తున్నారు. 


కమలం కండువా :


సంచయిత గజపతిరాజు లేటెస్ట్ గా బీజేపీలో చేరిపోయారు. ఆమె కుటుంబ వారసత్వం, , రాజకీయ నేపధ్యం చూసుకుంటే బీజేపీలో చేరడాన్ని ఆ పార్టీ నాయకులు చాలా ఆనందిస్తున్నారు. ఆమె తండ్రి ఆనంద్ భీమీలీ ఎమ్మెల్యేగా, మంత్రిగా, బొబ్బిలి ఎంపీగా పనిచేశారు. ఆమె తల్లి ఉమాగజపతిరాజు విశాఖ ఎంపీగా గెలిచారు. దీంతో సంచయిత ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఆమె భీమిలి నుంచి అసెంబ్లీ బరిలోకి దిగవచ్చునని అంటున్నారు. ఏదేమైనా ఆమె రాకతో బీజేపీకి మంచి బూస్ట్ వచ్చినట్లే.



మరింత సమాచారం తెలుసుకోండి: