నవ్యాంధ్ర ప్రదేశ్ శాసనమండలి సభ్యుడు, సీనియర్ టీడీపీ నాయకుడు, గీతం విధ్యా సంస్థల అధిపతి డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి అమెరికా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలు అయ్యారు. కాగా... గీతం యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన ఎంవీవీఎస్‌ మూర్తి అలస్కాలోని ఆంకరేజ్‌ సిటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. వైల్డ్‌లైఫ్‌ సఫారీ చూసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.



కాగా... రోడ్డు ప్రమాద సమయంలో మూర్తితోపాటు మరో నలుగురు కారులో ఉన్నారు. ఈ ప్రమాదంలో మూర్తితో పాటు కారులో ప్రయాణిస్తున్న వెలువోలు బసవపున్నయ్య , శ్రీవీరమాచినేని శివ ప్రసాద్,  వి. బి ఆర్ చౌదరి (చిన్న) మృతి చెందినట్టు సమాచారం. వీరితో పాటు ఇదే కారులో ప్రయాణిస్తున్న కడియాల వెంకటరత్నం (గాంధీ) తీవ్ర గాయాలతో అలాస్కా ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఆంకరేజ్‌ సిటీ వద్ద గల వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించేందుకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 మూర్తి మరణంతో టీడీపీ పెద్ద దిక్కును కొల్పోయినట్లైంది.



మరింత సమాచారం తెలుసుకోండి: