చంద్ర బాబు నోరు తెరిస్తే అబద్దాలు ఆడటం అనేది అందరికీ తెలిసిందే. అయితే చంద్ర బాబు ఒకటి చేయాలనుకుంటే మరొకటి జరిగింది. దేశంలో ఎక్కడా మీరు ఇలాంటి సన్నివేశం చూసి ఉండరు అంటూ ట్విట్టర్ లో టీడీపీ అఫీషియల్ గా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అవును నిజమే దేశంలో ఇంకెక్కడా ఇలాంటి సీన్ చూసి ఉండం. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడుస్తున్నా ఇంకా ఇంతమంది సమస్యలు పరిష్కారం కాలేదంటే, బాధితులంతా న్యాయం కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారంటే ఆ గొప్ప చంద్రబాబుది కాక ఇంకెవరిది. 

తనకు తెలియకుండానే నిజం ఒప్పుకున్న చంద్రబాబు

దేశంలో ఇంకెక్కడా ఇలాంటి సీన్ లేదు అంటున్న బాబు, అసలిలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందనే విషయంపై ఆరా తీశారా? వారానికోసారి కలెక్టరేట్లలో, మండల కేంద్రాల్లో గ్రీవెన్స్ సెల్ లు పెడుతున్నా ఇంకా ఇంతమంది బాధితులు మిగిలున్నారంటే సమస్యల పరిష్కారం ఎలా సాగుతుందో వేరే చెప్పాలా?  అర్జీలు తీసుకోవడం అందరూ చేస్తారు. అధికారం చేతిలో ఉండి కూడా వాటిని ఎంతమేర పరిష్కరించగలిగామనేదే ముఖ్యం. హామీలకే పరిమితమయ్యే చంద్రబాబుకి వీరందరికీ హామీలివ్వడం ఓ లెక్కా. ఇదీ మా గొప్ప అంటూ పెట్టిన ఈ ఫొటోలపై ఇప్పటికే ఓ రేంజ్ లో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ఫొటోలకు పోజులివ్వడం ఆపేసి, కనీసం చేతిలో ఉన్న ఆ కొద్దిపాటి అర్జీలనైనా పరిష్కరించండంటూ చంద్రబాబుకు చురకలు అంటిస్తున్నారు నెటిజన్లు.

Image result for chandrababu naidu

ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేర్చని హామీలపై ఇప్పటికే జనాలు టీడీపీపై రగిలిపోతున్నారు. అధికార పార్టీ సభలు, సమావేశాల్లో ఎక్కడికక్కడ జనం ప్లకార్డుల రూపంలో తమ బాధలు చెబుతుంటే బలవంతంగా అణచి వేయడం మినహా వారి గోడుని చెవికెక్కించుకోని మొద్దు నిద్రలో ఉంది టీడీపీ ప్రభుత్వం. ఇప్పుడేమో సరిగ్గా ఎన్నికలకు 6 నెలల ముందు ఇలాంటి జిమ్మిక్కులతో సెల్ఫ్ డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: