జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం లో చేసిన ప్రజాపోరాట యాత్రలో పవన్ చేసిన కామెంట్లు ఆంధ్రా లో హాట్ టాపిక్ అయ్యాయి. గత కొన్ని రోజులుగా పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ పోలవరం ముంపు మండలాలలో అలాగే బుట్టాయిగూడెం లక్ష్మీపురం వంటి ప్రాంతాలలో పర్యటిస్తూ జంగారెడ్డిగూడెంలో జరిగిన మహాసభలో పాల్గొన్నారు.

Image may contain: 12 people, people smiling, people standing, crowd and outdoor

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్న అవినీతిని రానున్న ఎన్నికల్లో ప్రజలు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికలలో అబద్ధాలు చెప్పి డ్వాక్రా మహిళలను రైతులను మోసం చేసిన చంద్రబాబు రానున్న ఎన్నికల్లో కచ్చితంగా ఓడిపోతారని పేర్కొన్నారు.

Image result for pawan kalyan jagan

ముఖ్యమంత్రి కావాలంటే డబ్బు ముఖ్యం కాదని, ఒకవేళ డబ్బే ముఖ్యమైతే జగన్ ఎప్పుడో సీఎం అయ్యేవారని, అంబానీ పీఎం అయ్యి ఉండేవారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గత ఎన్నికలలో చంద్రబాబుకి అనుభవం ఉంది కాబట్టే మద్దతు తెలిపానని ఈ సందర్భంగా పవన్ తెలియజేశారు.

Image may contain: 2 people, beard

ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎన్ని స్థానాలు రావడానికి గల కారణం రాష్ట్ర రాజకీయాలలో ఉన్న ప్రముఖలకు అసలు సంగతి తెలుసు అని పేర్కొన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం చంద్రబాబుకి రాష్ట్రంలో ఎదురుగాలి వేయడం ఖాయమని పేర్కొన్నారు పవన్.




మరింత సమాచారం తెలుసుకోండి: